తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర సందర్బంగా “శ్రీ సమ్మక్క సారలమ్మ దివ్య చరిత్ర”ను తెలంగాణ జాగృతి పాటల రూపంలో ఆడీయో సీడీగా అందిస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చే జనవరి 7న ఆవిష్కరించబడ్డ ఈ సీడీలోని పాటలను జాగృతి సాంస్కృతిక విభాగం కన్వీనర్ కొదారి శ్రీను రచించారు. “సమ్మక్క సారలమ్మ దివ్య చరిత్ర” సీడీ ని దిగువ లింక్ లో వినవచ్చు. …
Read More »ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఔదార్యం..
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో జర్నలిస్ట్ వంగూరి ఈశ్వర్ భర్త నాగేశ్వరరావు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. ఈ సమస్యను ఖమ్మం ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేకంగా పరిగణించి స్వయంగా ఇటీవలే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చూడాలని కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ చొరవతోముఖ్యమంత్రి సహాయ …
Read More »జూబ్లీహిల్స్లో ఆరు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లను మరమ్మత్తులు చేసేందుకు గ్రేటర్ అధికారులు సిద్దమయ్యారు.హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ రోడ్లను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో బంజారాహిల్స్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. అలాగే జూబ్లీహిల్స్లో దాదాపు ఆరు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం నుంచి జూలై 9 వరకు జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి వాహనదారులు సహకరించాలని …
Read More »కత్తి వివాదంలో మరో టర్నింగ్ పాయింట్…
ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తి.. బెజవాడ డైరెక్టర్ వివేక్తో ఓ న్యూస్ చానల్ లైవ్ డిబేట్ పెట్టిన సంగతి తెలిసిందే. వివేక్ ఆ చర్చలో భాగంగా కత్తిని తన తల్లి గురించి రెండు ముక్కలు చెప్పమని అడుగ్గా మౌనంగా ఉండిపోయి అక్కడి నుండి అర్ధంతరంగా వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. దీంతతో మహేష్ కత్తి అలా వెళ్ళిపోవడంతో అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ కత్తి అలా …
Read More »రూ.783 కోట్ల ప్రాజెక్టుతో..టీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథాలకు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిదా అయ్యారు. దశాబ్దాల తరబడి తన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుకు తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ కలగానే మిగులస్తుంటే..సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడంతో త్వరలో ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ గురించి. సోమవారం …
Read More »తెలంగాణలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు..!
విదేశాల్లో ఎక్కువగా తినే డ్రాగన్ ప్రూట్ ఇక నుంచి తెలంగాణలోనూ విరివిగా దొరుకనుంది. డ్రాగన్ ప్రూట్ సాగును పెంపకాన్ని ఉద్యానశాఖ ప్రోత్సహిస్తోంది. డ్రాగన్ ప్రూట్ సాగుకు తెలంగాణ భూములు అనుకూలంగా ఉండడమే అందుకు కారణం.గులాబీ పండు పేరుతో కొత్త రకం పంటను తెలంగాణ ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. గులాబీ పండును చైనాలో డ్రాగన్ ప్రూట్ అని పిలుస్తారు. దీన్నే అమెరికాలో అమెరికన్ బ్యూటీ అంటారు. అయితే ఈ విదేశీ ఫలాన్ని …
Read More »మొన్న స్వాతి..నిన్న శ్రీవిద్య..ఇవాళ నర్సవ్వ..!
ప్రియుడి మోజులో పడి భర్తలను చంపుతున్న ఘటనలు ఈ మధ్య ఒకటి తరువాత ఒకటిగా బయటపడుతున్నాయి. మొన్న నాగర్ కర్నూల్ జిల్లాలో స్వాతి ప్రియుడి మోజులో పడి భర్త సుధాకర్ను చంపింది. ఈ ఘటన మరవకముందే హైదరాబాద్ కర్మాన్ఘాట్ లో కార్పెంటర్ నాగరాజు, నల్లగొండలో భారతి, గుంటూరులో శ్రీవిద్య.. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దైవదర్శనానికి అని తీసుకొచ్చి గొంతుకోసి …
Read More »తెలంగాణ చట్టసభలు..దేశానికే ఆదర్శం..విప్ గొంగిడి సునీత
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో ప్రారంభమైన రెండు రోజుల 18 వ అఖిల భారత విప్ ల సదస్సు తెలంగాణ శాసన సభ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ‘చట్టసభలు సమర్థవంతంగా పనిచెసేందుకు అనుసరించాల్సిన విధానం ‘అనే అంశం మీద ఆమె ప్రసంగించారు పద్నాలుగేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం మహోద్యమం నడిపిన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని గొంగిడి సునీత తెలిపారు. తన …
Read More »ఏపీలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం ..
అప్పటి ఉమ్మడి ఏపీలో ఏ ఒక్క ముఖ్యమంత్రికీ కూడా ఇన్నిసార్లు పాలాభిషేకాలు జరిగి ఉండకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగేళ్ల కాలంలో వందలసంఖ్యలో కేసీఆర్ కు పాలాభిషేకాలు జరిగాయి. వేల లీటర్ల పాలను అభిమానం రూపంలో కేసిఆర్ చిత్ర పటాలపై కురిపించారు. అయితే అనేక సందర్భాల్లో కేసీఆర్ కు పాలాభిషేకం చేసినా… ఆయన ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు కూడా బలంగానే …
Read More »పంచాయతీరాజ్ బిల్లు రూపకల్పనకు ఉపసంఘం
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ బిల్లును రూపొందించడానికి ఏడుగురు మంత్రులతో కూడిన ఉప సంఘం ఏర్పాటైంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షుడిగా ఉన్న మంత్రి వర్గ ఉపసంఘంలో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్ , ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, హరీశ్ రావు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం …
Read More »