తెలంగాణ రాష్ట్రంలో 30రోజుల పల్లె ప్రణాళిక కార్యాచరణ లక్ష్యానికి చేరువవుతున్నది. పారిశుద్ధ్యం, అభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన ప్రణాళిక సఫలికృతమై గ్రామీణ వాతావరణంలో మార్పుతెస్తున్నది. ప్రజాభాగస్వామ్యంతో చేపడుతున్న శ్రమదానాలతో పల్లె పరిశుభ్రంగా మారుతున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పచ్చబడుతున్నది. పవర్వీక్లో భాగంగా ఏండ్లకిందటి కరంటు కష్టాలు తొలగిపోతున్నాయి. 25వ రోజైన సోమవారం శ్రమదానాలు కొనసాగగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 రోజుల పల్లె ప్రణాళిక …
Read More »తక్షణమే చర్యలు చేపట్టాలి-మంత్రి జగదీష్
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోమూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక రెగ్యులేటరీ గేట్ విరిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. గేట్ విరగడంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. ఈ నేపథ్యంలో మూసీ డ్యామ్ వద్దకు చేరుకున్న మంత్రి జగదీశ్రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, ఈఎన్సీ మురళీధర్రావు.. గేట్ విషయమై నీటిపారుదల అధికారులతో సమీక్ష …
Read More »అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు సద్దుల బతుకమ్మ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. స్టేడియంలో ఆడపడుచులంతా తీరొక్క పూవులతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ.. నృత్యాలు చేశారు. మహిళలంతా ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్బండ్ వరకు …
Read More »చండిహోమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో అన్ని పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని, సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృది కార్యకలాపాల్లో కొత్త పుంతలు తొక్కాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అభిలషించారు. లోక కళ్యాణార్ధం సితఫలమండిలోని ఉప్పలమ్మ సమేత కనక దుర్గ దేవాలయంలో ఆదివారం నిర్వహించిన చండి హోమం లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు.హోమం క్రతువును వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ దసరా పండుగకు ప్రాముఖ్యత …
Read More »ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో నిన్న శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలు,ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాత్కాలిక పద్ధతిన కండక్టర్లను,డ్రైవర్లను నియమించి మరి బస్సులను నడుపుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రజలు ఎదుర్కుంటున్న పలు …
Read More »మృతుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కేంద్రం చింతల్ చెరువు కట్ట పై పిడుగు పడి హనుమాన్ నగర్ కి చెందిన పస్తం శ్రీనివాస్ , బాల రాజు ఇద్దరు మృతి చెందారు , ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ సంఘటన పై మంత్రి హరీష్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం పక్షాన …
Read More »పాలకుర్తి శ్రీ సోమేశ్వరుడి సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఈ రోజు జనగామ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాలకుర్తి శ్రీ స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. స్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు శాస్తోక్తంగా ఘనస్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారు సోమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకం జరుపుతుండగా ఆలయ ప్రాంగణాలన్నీ వేదం, ఆశీర్వవచనాలతో …
Read More »శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్న మంత్రి హరీష్రావు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తొలిసారిగా హిందూ ధర్మ ప్రచారయాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రారంభించిన సంగతి విదితమే. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు స్వామివారు వరంగల్లోనే పర్యటిస్తారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ రాజశ్యామల అమ్మవారిని నిత్య పీఠపూజలు చేసిన …
Read More »ధర్మారం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి…!
హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా పాల్గొని రాజశ్యామల అమ్మవారికి పీఠపూజ, చండీ నామం, దుర్గాసప్తశతిపూజ, స్పటిక శివలింగానికి రుద్రాభిషేకం వంటి పూజలు చేస్తూ, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. తదనతరం ప్రతినిత్యం …
Read More »వరంగల్ దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి సందేశం..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యేక పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడవరోజు రాజశ్యామల అమ్మవారి విగ్రహానికి పూలతో, ఆభరణాలతో అందంగా అలంకరణలు చేసి వివిధ పూజాది …
Read More »