తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, పెట్రోల్తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు గానీ, రోడ్డు …
Read More »TimeLine Layout
February, 2021
-
4 February
తెలంగాణపై పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెయిమ్ ప్రశంసలు
భారత్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెయిమ్ ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 3.7శాతం పచ్చదనాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నదని ట్విట్టర్లో పేర్కొన్నారు. సోల్హెయిమ్ నార్వే అంతర్జాతీయ అభివృద్ధిశాఖ మంత్రి గా, పర్యావరణశాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. …
Read More » -
4 February
తమీమ్ ఇక్బాల్ అరుదైన ఘనత
బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 3 ఫార్మాట్లలో ఒక దేశం తరపున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 60 టెస్టుల్లో 4,405, 210 వన్డేల్లో7,360,టీ20ల్లో 1,758 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు నమోదు చేశాడు. ఇక భారత్ తరపున టెస్టులు, వన్డేల్లో సచిన్… టీ20లో కోహ్లి టాప్ స్కోరర్లుగా ఉన్నారు.
Read More » -
4 February
విజయశాంతి వార్నింగ్.. ఎవరికి..?
తెలంగాణ బీజేపీకి చెందిన కార్యకర్తలకు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు.పరకాల అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి వేధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలను మాత్రం అరెస్టు చేయలేదని ఆరోపించారు. తాము తెగిస్తే జైళ్లు సరిపోవన్నారు.టీఆర్ఎస్ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే వరంగల్ …
Read More » -
4 February
గూగుల్ పొమ్మంది.. మైక్రోసాఫ్ట్ రమ్మంది
మీడియా సంస్థల వార్తలను తమ ప్లాట్ ఫాంపై చూపిస్తున్నందుకు ఆ సంస్థలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయానికి మైక్రోసాఫ్ట్ సానుకూలంగా స్పందించింది. అయితే కొంతకాలంగా గూగుల్, ఫేస్ బుక్ ఇందుకు నిరాకరిస్తున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని గూగుల్ తెలిపింది. అవసరమైతే ఆస్ట్రేలియాలో తమ సేవలు నిలిపేస్తామంది. ఈ క్రమంలోనే తమ బింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా మైక్రోసాఫ్ట్ తాజా ప్రకటన చేసింది
Read More » -
4 February
కీర్తి సురేష్ కు మరో గుర్తింపు.. ఏంటి అది..?
మహానటి’ కీర్తి సురేష్ కు మరో గుర్తింపు లభించింది తాజాగా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లిస్ట్ లో ఆమెకు స్థానం దక్కింది. తమిళం, తెలుగు, మలయాళ చిత్రసీమల్లో ఆమె చేస్తున్న విశేష సేవలకు ఈ గుర్తింపు లభించినట్లు ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. దీనిపై స్పందించిన కీర్తి.. ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. వివిధ రంగాల ప్రముఖుల సరసన తన పేరుండటం ఆనందంగా ఉందని …
Read More » -
4 February
మునగాకుతో ఉపయోగాలు
మనం తినే కూరల్లో మునగ కాడలు వాడినంతగా ఆకును అంతగా వాడరు. కానీ మునగాకు కూడా ఆరోగ్యానికి మరింత మంచిది. మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం. వీటిలో బీటా కెరోటీన్, విటమిన్ C, మాంసకృత్తులు,ఇనుము మరియు పోటాషియం ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్లు, సాస్లులోనూ ఉపయోగిస్తారు. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాలేయంలో చేరిన విషపదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది
Read More » -
4 February
మీకు రాత్రి నిద్రపట్టడం లేదా..?
రాత్రి నిద్రపట్టడం లేదా నిద్రకు ముందు ఫోన్ వాడకండి పడుకునే ముందు గ్లాసు వేడి పాలు తాగండి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి రాత్రివేళల్లో టీ, కాఫీలు తాగకండి రాత్రి భోజనం మితంగా తీసుకోండి పడుకునే ముందు మెడిటేషన్ చేయండి ఒకే సమయానికి నిద్రించేలా చూసుకోండి ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి
Read More » -
4 February
ఇండియా సెలబ్రేటీలకు లాయర్ ప్రశాంత్ భూషన్ దిమ్మతిరిగే కౌంటర్
రైతు ఆందోళనల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు తలదూర్చడాన్ని వ్యతిరేకిస్తూ సచిన్ చేసిన ట్వీట్కు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కౌంటరిచ్చారు. రైతుల దీక్షలో కరెంట్, నీళ్లు, ఇంటర్నెట్ సేవలను కట్ చేసినప్పుడు, బీజేపీ మద్దతుదారులు రాళ్లు విసిరినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు? . రిహాన్నా, గ్రెటా ట్వీట్లు చేసేసరికి అందరూ నోళ్లు తెరుస్తున్నారు. వీళ్లంతా వెన్నెముక లేని మనసు లేని సర్కారు సెలబ్రిటీలు’ అని కౌంటర్ ఇచ్చారు
Read More » -
4 February
భారత్ లో 30కోట్ల మందికి కరోనా
మొత్తం 135కోట్ల జనాభా ఉన్న ఇండియాలో సుమారు 30 కోట్ల మందికి కరోనా వ్యాపించి ఉండొచ్చని ICMR సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గిన విషయం కూడా తెలియకపోవచ్చని సెరోలాజికల్ సర్వేకు చెందిన ఓ అధికారి చెప్పారు. తగినంత రోగనిరోధక శక్తి ఉండటం వల్లే లక్షణాలు బయటపడట్లేదన్నారు. 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 30 వేల మందిపై సర్వే నిర్వహిస్తే.. 15 మందికి ఒకరిలో కోవిడ్ …
Read More »