TimeLine Layout

January, 2021

  • 31 January

    దేశంలో  13,052 కరోనా పాజిటివ్‌ కేసులు

    గడిచిన 24 గంటల్లో దేశంలో  13,052 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా వైరస్‌ నుంచి కోలుకొని 13,965 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపింది. అలాగే మరో 127 మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో 1,07,46,183కు చేరాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 1,04,23,125 మంది కోలుకున్నారని పేర్కొంది. వైరస్‌ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య …

    Read More »
  • 31 January

    డీ రాజాకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ

    ఇటీవల అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నగరంలో జరుగుతున్న పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొన్న ఆయన నిన్న స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ నాయకులు ఆయన్ను కోఠీలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో దవాఖానలో చికిత్స పొంతుదున్న ఆయనను ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులతో …

    Read More »
  • 31 January

    అరుదైన ప్రజా కళాకారుడు పైలం సంతోష్

    ప్రజా కళాకారుడు పైలం సంతోష్ ను స్మరిస్తూ అంబటి వెంకన్న రాసిన పాటను సంతోష్ బిడ్డ స్నేహ హృద్యంగా ఆలపించిన గీతాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అరుదైన గొప్ప కళాకారుడు పైలం సంతోష్ అని, తెలంగాణ ఉద్యమంలో తను పోషించిన పాత్రను ఏనాడు మరువలేమని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలోనే గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ సాంస్కృతిక సారథి ని …

    Read More »
  • 31 January

    ఆరోగ్య తెలంగాణ వైపు రాష్ట్రం వడివడిగా అడుగులు

    తెలంగాణ రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటు తగ్గుదలలో దేశంలోనే  మొదటి స్థానంలో ఉందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఇది కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల ద్వారానే సాధ్యమయ్యిందని చెప్పారు. మహబూబాబాద్‌ జిల్లా ఏరియా దవాఖానలో పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 46 కేంద్రాల ద్వారా సుమారు 75 వేల మందికి పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు. బంగారు తెలంగాణ కావాలంటే …

    Read More »
  • 31 January

    సినిమా థియేట‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌

    దేశంలోని సినిమా  థియేటర్ల ఓన‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఈ మేర‌కు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. సినిమాలు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 100 శాతం సీట్ల‌ను నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అందులో స్ప‌ష్టం చేసింది. గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే థియేటర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చినా.. ఇప్ప‌టి వర‌కూ కేవ‌లం 50 …

    Read More »
  • 31 January

    తెలంగాణలో రేపటి నుండి బడి గంట

    కరోనా నేపథ్యంలో మూతబడిన విద్యాసంస్థలు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9 ఆపై తరగతులకు ప్రత్యక్షబోధనకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తివిద్యా కళాశాలలన్నీ తెరుచుకోబోతున్నాయి. మొత్తంగా 30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు 70శాతానికి పైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్టు అధికారులు చెప్తున్నారు. సమ్మతి …

    Read More »
  • 30 January

    గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి హర్షిత వెంకటేష్

    రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు ప్రీతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన బుల్లితెర నటి హర్షిత వెంకటేష్.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మనకు స్థలం లేని పక్షంలో టెర్రస్ గార్డెన్స్, హౌస్ …

    Read More »
  • 30 January

    తెలంగాణ అసెంబ్లీలో మ‌హాత్ముడికి ఘ‌న నివాళులు

    తెలంగాణ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని మ‌హాత్మాగాంధీ విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. మ‌హ్మాతుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన వారిలో శాస‌న‌స‌భ‌ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మండ‌లి ‌చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి గారు, హోంమంత్రి మ‌హముద్ అలీ గారు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ గారు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత‌ మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు గారు, నేతి …

    Read More »
  • 30 January

    భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే

    మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. దీంతో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు …

    Read More »
  • 30 January

    కరోనా వ్యాక్సిన్ పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో   రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కామినేని కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్నారు. శుక్రవారం వ్యాక్సిన్‌ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్నందుకు గర్వంగా భావిస్తున్నానని, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లంతా ముందుకు వచ్చి సురక్షితమైన వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఉపాసన సూచించారు. మహమ్మారిపై ఒక జాతిగా మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలన్నారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat