దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. హాట్స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో సాధారణ మార్గదర్శకాలు, అనుమతులు పనిచేయవని, నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవని తెలిపింది. మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైల్ సర్వీసులు రద్దు చేస్తున్నామని వెల్లడించింది. విద్యాసంస్థలు, …
Read More »TimeLine Layout
April, 2020
-
15 April
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. జమాల్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవాలాకు గత కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన రక్త నమూనాలను ఇటీవలే వైద్యులు సేకరించి ల్యాబ్కు పంపారు. రక్త నమూనాల ఫలితాలు వచ్చే కంటే ముందు.. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ నిర్వహించిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే ఇమ్రాన్ హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఇమ్రాన్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు …
Read More » -
15 April
తెలంగాణలో నడి ఎండల్లోనూ తడి ఆరని నేల తల్లి
సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు. ఆ తర్వాత నాలుగైదు నెలల్లోనే ఖాళీ. ఇక.. ఎండాకాలంలో చెరువు నెర్రెలుబారి మళ్లీ వరుణుడి కోసం ఎదురుచూస్తుంటుంది. తెలంగాణలో ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు మండువేసవిలోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలోని చారిత్రక గొలుసుకట్టు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వర్షాకాలం మాదిరిగా నిండుకుండల్లా కళకళలాడుతున్నయి. రెండుబేసిన్లలో మొత్తం 43,759 చెరువులకుగాను ఇప్పటికీ రెండువేల చెరువులు అలుగు పారుతున్నాయి. మరో 25 శాతం చెరువుల్లో …
Read More » -
15 April
సిద్దిపేటలో ‘ఈ-ఆహార’ యాప్
లాక్డౌన్ అమలులో భాగంగా ఇంటికే నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా చేస్తాం.. ఇంటి నుంచి ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఉంటే వైరస్ లింక్ తెగిపోతుందని నిపుణులు పేర్కొంటున్నందునే లాక్డౌన్ను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం.. ఇందులో భాగంగానే ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఈ- ఆహార’ యాప్ను ప్రారంభిస్తున్నాం’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇంటింటికీ నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించిన మహ్మద్ సభిని మంత్రి హరీశ్రావు …
Read More » -
15 April
ధోనీకి వయసు అయిపోలేదు
టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, ఇంకొంత కాలం అద్భుతంగా క్రికెట్ ఆడగలడని భారత సీనియన్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా అన్నాడు. ‘‘ధోనీ గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుంది. మేం ప్రాక్టీస్ గేమ్స్లో భారీ సిక్సర్లు బాదాం. వేడి ఎక్కువగా ఉండే చెన్నైలో సాయంత్రం మూడు గంటల పాటు బ్యాటింగ్ చేశాం. ఇంకా వయసు అయిపోలేదని అతడి శరీరం చెబుతోంది. …
Read More » -
15 April
డబ్ల్యూహెచ్ఓకు ట్రంప్ షాక్
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. తమ దేశం తరఫున సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు కరోనా వైరస్ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ.
Read More » -
15 April
అమెజాన్లో 75 వేల ఉద్యోగాలు
మహమ్మారి కోరలకు చిక్కిన ప్రపంచం.. వైరస్ బారినుంచి కోలుకునేందుకు ఇంకా అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు లాక్డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థలు, వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. మరోవైపు లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకమంది మారింది. అనేక సంస్థలు ఉద్యోగాలు తొలగింపు బాటలో అన్నాయి. అయితే ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ మాత్రం వేలాదిమందిని ఉద్యోగులుగా నియమించుకుంటోంది. కరోనా సంక్షోభ సమయంలో ఆర్డర్ల డిమాండ్ భారీగా …
Read More » -
14 April
తెలంగాణలో ఒక్కరోజే 61కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.కేవలం ఒక్కరోజే అరవై ఒకటి కొత్త కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటన చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 592కరోనా కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 472మందికి చికిత్సను అందిస్తున్నారు.మొత్తం మీద103మంది డిశ్చార్జ్ అయ్యారు. పదిహేడు మంది కరోనా భారీన పడి మృత్యువాత పడ్డారు.ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 216కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం విశేషం.
Read More » -
14 April
రైతులకు అండగా ఉందామంటున్న అనసూయ
ప్రస్తుతం గజగజవణిస్తున్న కరోనా విజృంభిస్తున్న తరుణంలో రైతన్నలకు అండగా ఉందామని హాట్ అండ్ బ్యూటీ యాంకర్ అనసూయ పిలుపునిచ్చింది. అనసూయ తన ఇన్ స్టాగ్రమ్ లో రైతులను ఉద్ధేశిస్తూ ఒక వీడియోను పోస్టు చేసింది.ఆ వీడియోలో ” రైతు దేశానికి వెన్నుముక..రైతు లేనిదే మనుగడ లేదు.కరోనా దాడి చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా రైతులకు అండగా నిలుద్దాం.మామిడి,అరటి ,బత్తాయి,నిమ్మ,జామ కాయలను కొనుక్కుందాం.. పండ్లను తిందాం..రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం..ఆరోగ్యాన్ని …
Read More » -
14 April
రాష్ర్టాలు 30 వరకే.. కానీ కేంద్రం లాక్డౌన్ 3 రోజులు ఎందుకు పొడిగించిందంటే?
కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అన్ని రాష్ర్టాలు పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ పొడిగించకపోతే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని ఆయా రాష్ర్టాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించాయి. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ పొడిగింపు వంటి అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే. ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ …
Read More »