TimeLine Layout

October, 2019

  • 23 October

    ఇసుకపై నీచ రాజకీయం చేస్తున్న పార్టనర్లకు చుక్కలు చూపించిన సామాన్యుడు..వైరల్ వీడియో..!

    చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి గ్రామస్థాయి నేతల వరకు ఇసుకను దోచుకుని వేలాది కోట్లు గడించారు. గత ఐదేళ్లలో టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి అడ్డూ, అదుపు లేకుండా పోయింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో ఇసుకపై ప్రభుత్వానికి గత ఐదేళ్లలోనే 2,800 కోట్లు వేల కోట్ల ఆదాయం వస్తే..ఏపీలో మాత్రం రూ.116 కోట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి ఏపీలో …

    Read More »
  • 23 October

    ఎమ్మెల్యే ధర్మారెడ్డికి సీఎం కేసీఆర్ అభినందనలు

    చాణక్య ఫౌండేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాకి చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత నెల 26 వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి, పద్మభూషణ్ మురళి మనోహర్ జోషి గారి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసారు. …

    Read More »
  • 23 October

    ఎంపీ రేవంత్ కు షాక్

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపె అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. అందులో భాగంగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బేగంపేటలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ ను ముట్టడించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేవంత్ పై ఆపార్టీకి చెందిన సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు. ఎవరికి చెప్పి రేవంత్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అని సీఎల్పీ సమావేశంలో …

    Read More »
  • 23 October

    తెలంగాణ హోమ్ శాఖ కార్యదర్శి మార్పు

    తెలంగాణ రాష్ట్ర హోం శాఖలో రెండు కీలక పదవుల్లో మార్పులు జరిగాయి. అందులో భాగంగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా రవిగుప్తాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జైళ్ల శాఖ డీజీ సందీప్ శాండిల్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజీవ్ త్రివేది ను నియమించింది. అయితే ప్రస్తుతం రవి గుప్తా తెలంగాణ అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్(టెక్నాలజీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

    Read More »
  • 23 October

    సంచలనం సృష్టిస్తున్న ట్రంప్ ట్వీట్

    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదో ఒక విషయంలో సంచలనం సృష్టించడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. తాజాగా ఆయన చేసిన ట్వీట్ కాకరేపుతుంది.ఈ ట్వీట్ సాక్షిగా ట్రంప్ తన నోటి దురుసును మరోసారి బయటపెట్టుకున్నాడు. రిపబ్లిక్ పార్టీని రీకాల్ చేసే క్రమంలో డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంస తీర్మానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నెగ్గాడు. అయితే దీనిని ట్రంప్ మూకదాడిగా అభివర్ణించాడు. డెమోక్రాటిక్ పార్టీ నేతలు ఎంతగా పోరాడిన …

    Read More »
  • 23 October

    నిరుద్యోగ యువతకు శుభవార్త

    ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఖచ్చితంగా శుభవార్తనే. స్టాప్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవల్(సీజీఎల్) ఎగ్జామిషన్ 2019-20నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలయింది. కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలు,విభాగాలు సంస్థల్లో ఉన్న వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇందులో చాలా పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉంది. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా …

    Read More »
  • 23 October

    ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది.  చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో …

    Read More »
  • 23 October

    రూ.53 వేల కోట్లు నష్టం

    ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫో సిస్ లో అనైతిక విధానాలకు పాల్పడ్డారని వార్తలు రావడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.53 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.బీఎస్ఈలో షేర్ ధర 16% పతనమైంది. దీంతో రూ.638 దగ్గర ఉంది. అయితే 2013నుండి ఇప్పటివరకు ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో ఇన్ఫోసిస్ షేర్ పతనమవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా 16.65% తగ్గి రూ.640వద్ద ముగిసింది.

    Read More »
  • 23 October

    ఈ నెల 30న ఏపీ క్యాబినేట్ భేటీ

    ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గం ఈ నెల ముప్పై తారీఖున సమావేశం కానున్నది. అంతేకాకుండా ఇక నుండి ప్రతినెల పది హేను రోజులకు ఒకసారి క్యాబినేట్ భేటీ కావాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఇందులో భాగంగా ప్రతి నెల రెండు,నాలుగు బుధవారాల్లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల ముప్పై తారీఖున కానున్న భేటీలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకోనున్న …

    Read More »
  • 23 October

    పిల్లలను తల్లులు వేధిస్తే ఇక అంతే సంగతులు

    తల్లులు తమ పిల్లలతో దురుసుగా ప్రవర్తిస్తే పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని న్యూయార్క్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. తల్లులు తరచూ తిడుతూ వేధింపులకు గురిచేస్తే పిల్లల మెదడుల్లోని హిప్పోకాంపస్ ,అమిగ్దల భాగాలు కుచించుకుపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా దురుసుగా ఉండే తల్లులకు దూరంగా ఉండేందుకు పిల్లలు మొగ్గుచూపుతున్నట్లు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని వారు చెబుతున్నారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat