తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఒంటె మాంసాన్ని తరలిస్తున్న లారీలను స్థానికుల సహకారంతో పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఓ రైతు పొలం దగ్గర గుర్తు తెలియని దుండగులు ఒంటెలను వధించారు. నాలుగు లారీల్లో 30 ఒంటెలను ఇటీవల తీసుకొచ్చారు. అనంతరం వాటిని బుధవారం అర్ధరాత్రి కోసి 4 డీసీఎం వ్యాన్లలో 20 క్వింటాళ్లకు పైగా ఒంటె మాంసాన్ని హైదరాబాద్కు లారీల్లో తరలించడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన …
Read More »TimeLine Layout
November, 2017
-
16 November
టీఆర్ఎస్ నేత దారుణ హత్య..
అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ప్రముఖ విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావు దారుణహత్యకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ బస్టాప్ సమీపంలో ఆయనను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో టీఆర్ఎస్ పేరుతో శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిలో కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వల్లభనేని శ్రీనివాసరావు అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.
Read More » -
16 November
భువనేశ్వరి కొడుకు అరెస్ట్
సినీ నటి భువనేశ్వరి కొడుకు ( మిథున్ శ్రీనివాసన్ ) ను పోలీసులు అరెస్ట్ చేసారు .. అసలు విషయం ఏమిటంటే… మిథున్ లా చదువుతున్నాడు. ఇతనికి స్థానిక అన్నానగర్, తిరుమంగళంలో నివశిస్తున్న ఒక యువతికి ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అనంతరం ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం పెరగడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతిపై ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో మిథున్ శ్రీనివాసన్ ఆ …
Read More » -
16 November
ఎన్టీఆర్పై లక్ష్మీరాయ్ సంచలన వ్యాఖ్యలు! వింటే షాకే!!
టాలీవుడ్ టు హాలీవుడ్ వరకు బోల్డ్ స్టేట్మెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే నటీమణుల్లో హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ ఒకరు. ఒకానొక సమయంలో హీరోయిన్ల విషయంలోనూ అదే స్థాయిలో బోల్డ్గా స్టేట్మెంట్లు ఇచ్చి టాక్ ఆఫ్ద ఇండస్ర్టీగా మారింది. ఆ సమయంలో సినిమా నిర్మాతలు హీరోయిన్లతో శృంగారం కోసం ఆసక్తి చూపిస్తుంటారని, ధనవంతలు సినిమా నిర్మాతలుగా మారడానికి కారణం కూడా అదేనంటూ… దాన్ని ఆశించే అందమైన అమ్మాయిలను హీరోయిన్లుగా పెట్టి …
Read More » -
16 November
గ్రేటర్లో మరో 20 రిజర్వాయర్లు..
తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి ఇంటికి నల్లాద్వారా సమృద్ధిగా తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పట్టణ భగీరథ పథకం ఫలాలు విరివిరిగా అందుతున్నాయి. ఇప్పటికే ఏడుచోట్ల భారీ స్టోరేజీ రిజర్వాయర్లను ప్రారంభించి ప్రజల గొంతును తడిపిన జలమండలి.. ఈ నెల 26వ తేదీన గడ్డిఅన్నారం, ఎల్బీనగర్ తదితర సర్కిళ్ల పరిధిలోని మరో 20 రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే …
Read More » -
16 November
కరీంనగర్లో అలా మూత్రం పోస్తే..ఇలా అభినందిస్తారు
అదేంటి..మూత్రం పోయడం ఏంటి…అభినందనలు ఏంటి అని ఆశ్చర్యపోకండి. అదే కొత్త విషయం మరి. బహిరంగ మలవిసర్జనకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కరీంనగర్ పోలీసులు వినియోగిస్తున్నారు. లోయర్ మానేరు డ్యామ్ కు చుట్టుపక్కల వున్న నాలుగు జిల్లాల ప్రజలకు మంచినీటి అవసరాలను తీరుస్తున్న డ్యామ్ నీటిని కలుషితం కాకుండా చూసేందుకు దాని చుట్టుపక్కల బహిరంగ మలవిసర్జనను అరికట్టాలని కరీంనగర్ పోలీసులు నిశ్చయించుకున్నారు. ఇందుకోసం వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. డ్రోన్ కెమెరాల …
Read More » -
15 November
సీఎం కేసీఆర్ను కలిసిన లగడపాటి.. కారణం ఇదే
సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణవాదుల చేతుల్లో దెబ్బలు తిని, విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేసి, అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి, నిమ్స్లో ఉరుకులు పరుగులతో బెడ్మీద చేరి, చివరకు….రాజకీయాలకు దూరం అంటూనే జోస్యాలు చెప్తూ టైం గడిపేస్తున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్…టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్కు బుధవారం వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన …
Read More » -
15 November
స్టెప్పులేసిన పద్మక్క..
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కార్యకర్తలతో పాటు స్టెప్పులేసి వారిలో జోష్ నింపారు . మెదక్ జిల్లా రామాయంపేట్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ఆటపాటలతో అదరగొట్టారు.ప్రస్తుత ఈ వీడియో వైరల్ గా మారింది..
Read More » -
15 November
పదో రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదో రోజు షెడ్యూల్ విడుదలైంది.పదో రోజు పాదయాత్రలో భాగంగా ఉదయం 8గంటలకు ఆళ్లగడ్డలో పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 8.30లకు పెద్ద చింతకుంట చేరుకుంటారు. అక్కడ నుంచి దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది.మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం …
Read More » -
15 November
తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలు..సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో ప్రగతి భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ …
Read More »