తిరుమలగిరులు ఒక ప్రకృతి అద్భుతం. అరుదైన జాతుల వృక్షాలు, జంతువులు, సర్పాలకు ఆవాసం. వీటితో పాటు ప్రతి చెట్టు, రాయి శ్రీవేంకటేశ్వరస్వామి స్వరూపమని పురాణాల కథనం. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రకృతి సోయగాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. తిరుమలల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దారి పొడవునా జలపాతాలు, సెలయేర్లు జలకళ సంతరించుకున్నాయి. వర్షం నిలిచి నిలిచి వస్తుండడంతో విరామంలో మేఘాలు …
Read More »TimeLine Layout
November, 2017
-
7 November
దేశంలో కేసీఆర్ ఒక్కరే..ఖలేజా ఉన్న సీఎం
దేశంలో ఖలేజా ఉన్న సీఎం కేసీఆర్ ఒక్కరేనని విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.కార్తీక సోమవారం సందర్భంగా నవంబర్ 5న హన్మకొండ వేయిస్తంభాల గుడిలో ‘రుద్రేశ్వరుడి లక్ష బిల్వార్చన’ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి.. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాల కోసం ఆయుత చండీయాగం చేసి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని కొనియాడారు.అనేక …
Read More » -
7 November
అనవసర ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ఆర్ధిక శాఖ ..
ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు తీవ్ర ఆందోళనకరంగా తయారవుతుంది .ఈ క్రమంలో రాబడితో సంబంధం లేకుండా అనవసరపు ఖర్చులు చేస్తుండడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది .దీంతో రాష్ట్రంలో సర్కారు నిర్మించతలపెట్టిన పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలకు సంబంధించిన దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి . అయితే అరవై ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్టుల …
Read More » -
7 November
ఒక్కొక్క విద్యార్థిపై 41 వేల ఖర్చు పెడుతున్నాం.. కడియం
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 2016-17 విద్యాసంవత్సరానికి గానూ.. ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు విద్యను అందించడానికి రూ. 10,130 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై రూ. 41,196 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల జీతాలు, సిబ్బంది వేతనాలు, పాఠశాలలో వసతుల కల్పన, టాయిలెట్స్ మెయింటనెన్స్, అదనపు తరగతి గదుల కోసం నిధులు …
Read More » -
7 November
ఆంధ్రా యూనివర్సిటీ ప్రోపెసర్ పై విద్యార్థినులు దాడి…ఇంత కామాంధుడా..?
ఆంధ్రా యూనివర్సిటీ సంస్కృత విభాగాధిపతి ఆచార్య కె.ఏడుకొండలుపై వర్సిటీ విద్యార్థినులు దాడి చేశారు! ఆయన తమపై సాగిస్తున్న లైంగిక వేధింపులను తట్టుకోలేక దాడికి పాల్పడినట్టుగ వారు ప్రకటించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు ధర్నాకు దిగారు. వర్సిటీలో సోమవారం ఈ సంఘటనలు సంచలనం రేపాయి. వర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థినుల ఫిర్యాదు స్వీకరించి ఆందోళనను విరమింపజేశారు. గత ఏడాది మే నెలలో ఏడుకొండలు …
Read More » -
7 November
కాళ్లు కట్టేసి..నోట్లో గుడ్డలు కుక్కి…మృగం కన్నా దారుణంగా..!
అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి.. హతమార్చిన దారుణం మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. మృగంలా మారిన ఆగంతుకుడు బాలిక కాళ్లు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. పశువాంఛ తీర్చుకున్న తర్వాత ఆమెను చంపేసి పొలాల్లో పడేశాడు. బాలిక మృతదేహంపై అనేకచోట్ల పళ్లతో కొరికిన గాట్లున్నట్లు పోలీసులు తెలిపారు. దేవాస్ జిల్లా సుంద్రెల్ గ్రామానికి చెందిన బాలిక శుక్రవారం సాయంత్రం తన తండ్రి …
Read More » -
7 November
ప్రజాసంకల్పయాత్ర.. జగన్ అడుగులో అడుగులు వేస్తూ….!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రని సోమవారం ప్రారంభించారు. మొదటి రోజు సక్సెస్ ఫుల్గా ముగిసిన పాదయాత్ర.. రెండోరోజు పాదయాత్ర ప్రారంభమయింది. వేంపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈరోజు 12.9 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ చేయనున్నారు. అయితే వేలాది మంది అభిమానులు పాదయాత్రలో జగన్కు అండగా నిలబడేందుకు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ …
Read More » -
7 November
నష్టపోయిన పత్తి రైతులను ఆదుకుంటాం..కేసీఆర్
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సారి పత్తి రైతులకు మంచి మద్దతు ధర వస్తుందని ఆశిస్తున్నామని సీఎం చెప్పారు. మద్దతు ధర కోసమే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం …
Read More » -
7 November
కర్నూల్ జిల్లాలో టీడీపీ పార్టీకి షాక్…దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశానికి సేవలందిస్తున్న
కర్నూల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. సంజామల మండలం కమలపురి గ్రామానికి చెందిన ఈయన 40 సంవత్సరాలుగా కోవెలకుంట్ల పట్టణంలో డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తున్నారు. రామిరెడ్డి సేవా సమితి ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాల నుంచి పేద కుటుంబాల జీవనోపాధికి, పేద యువతుల వివాహానికి ఆర్థికసాయం …
Read More » -
7 November
పబ్లిసిటీ కోసం రక్కస్ చేయడం సరికాదు..సీఎం కేసీఆర్
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. శాసనసభలో బీజేపీ సభ్యులు నిల్చొని నిరసన తెలుపడంతో.. సీఎం కేసీఆర్ స్పందించారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని.. ఆ క్రమంలో ప్రతీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. శాసనసభలో తమ గొంతు వినిపించే అవకాశం లేని వారు ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తారని సీఎం తెలిపారు. ఛలో అసెంబ్లీ అని వస్తే సీఎం …
Read More »