లైగర్ మూవీ హీరో విజయ్ దేవరకొండ దివంగత కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్కు నివాళులు అర్పించారు. సినీ ఇండస్ట్రీకి ఆయన తీరనిలోటు అని వ్యాఖ్యానించారు. బెంగుళూరు వెళ్లిన లైగర్ టీమ్ కంఠీరవ స్టేడియంలోని పునీత్ సమాధిని దర్శించుకున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ అనన్య పాండే తదితరులు ఉన్నారు. పునీత్ రాజ్కుమార్ గతేడాది అక్టోబరులో గుండెపోటుతో మరణించారు.
Read More »TimeLine Layout
August, 2022
-
19 August
సమంతకు ఏమైంది..? నెటిజన్స్ రిక్వెస్ట్కి కారణమేంటి..?
ఫేమస్ హీరోయిన్ సమంత.. ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సామ్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. కొన్ని మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతుంటారు. సామ్ కూడా ప్రతి విషయాన్ని తన సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తూ చాలా అప్డేట్గా ఉంటుంది. తాజాగా సమంత విషయంలో అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. సామ్ సామ్ అంటూ నెట్టింట రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఇంతకీ సామ్ ఫ్యాన్స్ బాధపడేలా ఏం …
Read More » -
19 August
ఛార్మికి తనకు ఉన్న రిలేషన్పై పూరీ షాకింగ్ కామెంట్స్..!
సెలబ్రిటీల ప్రేమలు, లివింగ్ రిలేషన్షిప్లు, పెళ్లిళ్లు వంటి వారి పర్సనల్ లైఫ్పై అనేక వార్తలు వైరల్ అవుతుంటాయి. వారు అడుగు తీసి అడుగు పెట్టిన అదో సెన్షేషన్ అవుతోంది. ఇలాంటిదే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి విషయంలోనూ ఎప్పటినుంచో జరుగుతోంది. వీరిద్దరి రిలేషన్ ఏంటని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై వారిద్దరూ ఎప్పడూ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ తాజాగా పూరీ జగన్నాథ్ దీనిపై …
Read More » -
19 August
కూతురి ఫస్ట్ బర్త్డేకి లక్ష పానీపూరీలు ఫ్రీ
ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేసే రోజుల్లో ఆ తండ్రి ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ పోషణకు పానీపూరీ బండి పెట్టుకున్న ఓ సాధారణ చిరువ్యాపారి కూతురి మొదటి పుట్టినరోజుకు ఏకంగా లక్ష పానీపూరీలు ఫ్రీగా ఇచ్చి తమ ముద్దుల కుమార్తెపై ప్రేమను చాటుకున్నాడు. మధ్యప్రదేశ్ భోపాల్లోని కోలార్కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్త తన కూమార్తె ఫస్ట్ భర్త్డే రోజున 1.01 లక్షల పానీపూరీలు ఉచితంగా పంచాడు. …
Read More » -
18 August
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్లకే తెలియాలని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. రాష్ట్ర నాయకత్వం తనను సైలెంట్లో ఉంచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలమని.. బాధ్యతలు ఇవ్వకుండా ఏం చేయగలమని విజయశాంతి ప్రశ్నించారు. తనదెప్పుడూ రాములమ్మ పాత్రేనని.. ఉద్యమకారిణిగా అందరి …
Read More » -
18 August
పోలీసుల నాగిని డ్యాన్స్ వైరల్.. ఎక్కడంటే..!
యూపీలోని కొత్వాలీ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు నాగిని డ్యాన్స్కు స్టెప్పులేసి అదరగొట్టారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది. ఓ ఎస్సై, కానిస్టేబుల్ నాగిని డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా చూట్టూ ఉన్న ఇతర పోలీసులు వారిని ఉత్సాహపరుస్తూకనిపించారు. జైకీ యాదవ్ అనే ఓ …
Read More » -
18 August
‘3 నెలలకు ఒకసారి ప్రమోషన్.. ఇన్ టైంలో జీతం’..!
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. గత త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గడం వల్ల ఉద్యోగుల వేరియబుల్ పే ను కంపెనీ నిలిపివేస్తున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లకొట్టాయి. దీనికి స్పందించిన సంస్థ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో వెనకడుగు వేయడం లేదని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రమోషన్ల …
Read More » -
18 August
8 యూట్యూబ్ ఛానెల్స్ను బ్లాక్ చేసిన కేంద్రం..!
సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్దుకునేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 8 యూట్యూబ్ ఛానెల్స్ను బ్లాక్ చేసింది. ఇందులో 7 ఇండియాకు చెందినవి కాగా, 1 పాకిస్థాన్కు చెందినది. ఈ ఛానెళ్లను 85 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇవి అప్లోడ్ చేసే వీడియోస్ను 114 కోట్ల మంది చూశారు. ఇలాంటి వీడియోస్ అప్లోడింగ్.. భారత సాయుధ బలగాలు, జమ్మూకశ్మీర్కు …
Read More » -
18 August
ఆ మూవీ కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్ముకున్నాడా..?
ఫేమస్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్.. గూఢచర్యం ఆరోపణల్ని ఎదుర్కొని నిరపరాధిగా బయటపడ్డారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ. ఇందులో మాధవన్ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమా కోసం మాధవన్ ఇంటిని అమ్ముకున్నాడని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాకెట్రీని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చారని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన మాధవన్ ఏం చెప్పారంటే.. నెటిజన్ ట్వీట్ ఇదే.. రాకెట్రీ సినిమా …
Read More » -
18 August
సిటీలో దారుణం .. ప్రియురాలి వెంటే ప్రియుడు
ఆ ఇద్దరు ఫేస్బుక్లో పరిచయమై ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల్లో విషయం చెప్పి ఒక్కటి అవ్వాలి అనుకున్నారు. కానీ వారు నిరాకరించడంతో పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్నారు. అంతా బాగుంది అనుకునేలోపే ఆ జంట తీసుకున్న నిర్ణయం అందర్ని కలచి వేసింది. యువతి తల్లిదండ్రులు ఈ జంటను విడదీయడంతో యువతి సూసైడ్ చేసుకుని చనిపోయింది. భార్య మరణాన్ని భరించలేక ఆ భర్త హైదరాబాద్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Read More »