TimeLine Layout

June, 2022

  • 18 June

    వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకి షాక్

    ఏపీ అధికార పార్టీ వైసీపీ  బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న  సంగతి విధితమే. అయితే అనంత్ బాబుకు చెందిన బెయిల్ పిటిషన్ ను రాజమహేంద్రవరం SC, ST కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ మంజూరుకు నిందితుడు అనంతబాబు తరపున న్యాయవాది సరైన కారణాలు చూపకపోవడంతో పిటిషన్ రద్దు …

    Read More »
  • 18 June

    అగ్నిపథ్ పై కేంద్రం తాజా నిర్ణయం

    కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకోచ్చిన అగ్నిపథ్ పై  దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి మనం  సంగతి విదితమే. కేంద్ర సర్కారు తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తొలి బ్యాచ్ అగ్నివీరులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, CAPFలలో 10% పోస్టులను అగ్నివీరులతో భర్తీ చేస్తామంది.

    Read More »
  • 18 June

    సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్ల సూత్రదారి అరెస్ట్

    కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని దక్షిణమధ్య రైల్వే కేంద్రమైన  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై  ఏపీకి చెందిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసారావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీని నడుపుతున్న సుబ్బారావు.. ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో తన సొంతూరు ఖమ్మంలో ఉన్నట్లు తెలుసుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. …

    Read More »
  • 18 June

    దేశంలో కొత్తగా 13,216 కరోనా కేసులు

     దేశంలో వారం రోజులుగా  కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా  13,216 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి. ఇందులో 4,26,90,845 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,840 మంది మరణించారు. మరో 68,108 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 23 మంది బాధితులు కరోనాకు బలవగా, 8148 మంది డిశ్చార్జీ అయ్యారు.కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 4,165 కేసులు …

    Read More »
  • 18 June

    గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న హీరోయిన్ మధుశాలి

     టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ముధుశాలిని చ‌డి చ‌ప్పుడు లేకుండా వివాహం చేసుకుని సినీ ప్రేక్ష‌కుల‌ను,తన అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేసింది. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్‌ను, మ‌ధుశాలిని పెళ్ళి చేసుకుంది. గురువారం రోజు హైద‌రాబాద్‌లో ఇరుకుటుంబ సభ్యులు, స‌న్నిహితుల‌ మ‌ధ్య వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ప‌లువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీప్రముఖులు పెళ్ళికి హ‌జరై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. 2019లో వ‌చ్చిన ‘పంచాక్ష‌రం’ అనే త‌మిళ సినిమాలో వీరిద్ద‌రూ క‌లిసి …

    Read More »
  • 18 June

    ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

     ఈ నెల 19న  ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు అన్ని బస్‌ సర్వీస్‌ల్లో ఆ ఒక్కరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

    Read More »
  • 18 June

    రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు నివాళులు

    కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్  ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్‌కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌ రెడ్డి, బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్‌ నివాళులు అర్పించారు.రాకేశ్‌ మృతికి నిరసగా నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాకేశ్‌ మృతదేహంతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ …

    Read More »
  • 18 June

    బీజేపీ సర్కార్‌ అన్ని వర్గాలను అణగదొక్కుతుంది

     ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌ అన్ని వర్గాలను అణగదొక్కుతున్నదని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాకేశ్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్‌ మృతదేహానికి ఎంజీఎం దవాఖానలో నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం మొండి వైఖరిని అందరూ ఖండించాలన్నారు. సైన్యంలో కూడా ఔట్‌సోర్సింగ్‌ విధానం తీసుకురావడం …

    Read More »
  • 18 June

    యోగాతో శరీరానికి ఎంతో మేలు

    ప్రతి రోజూ మనం  చేసే యోగాతో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో నిర్వహించిన పాదయాత్రలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగ ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా …

    Read More »
  • 18 June

    ఉమ్మడి పాలమూరులో మంత్రి కేటీఆర్ పర్యటన

    తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు శనివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్‌ర్నూల్, కొల్లాపూర్ పట్టణాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొల్లాపూర్‌లో సింగోటం నుంచి గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే రూ.147 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడతారు. మధ్యాహ్నం ఒంటి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat