TimeLine Layout

June, 2022

  • 17 June

    దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్‌’: నారాయణ

    నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. దాని ఫలితమే దేశంలో హింసాకాండ అని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నారాయణ స్పందించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను అర్ధంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మాయ చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతోనే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు.

    Read More »
  • 17 June

    బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద రేవంత్‌రెడ్డి అరెస్ట్‌

    తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న రేవంత్‌రెడ్డి పోలీసులను దాటుకుని క్యాంపస్‌లోనికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ తర్వాత వారి నుంచి తప్పించుకుని గోడదూకి లోనికి ప్రవేశించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి రేవంత్‌ను …

    Read More »
  • 17 June

    దాని అర్థం ‘విశ్వగురు’కే తెలుసు: కేటీఆర్‌ సెటైరికల్‌ ట్వీట్‌

    దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్‌’పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తన దైన శైలిలో వ్యంగ్య్యాస్త్రాలు సంధించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలపై విమర్శలు చేశారు. ‘‘రైతు చట్టాలు రైతులకు అర్థంకావు.. సాధారణ ప్రజలకి నోట్ల రద్దు అర్ధం కాదు.. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు.. ముస్లింలకు సీఏఏ అర్థం కాదు.. గృహిణులగా ఉన్న మహిళలకు ఎల్‌పీజీ …

    Read More »
  • 17 June

    సంజయ్‌లాంటి నేతల వల్లే దేశంలో అశాంతి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

    బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనల వెనుక టీఆర్‌ఎస్‌ ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలు సంజయ్‌ అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. దేశ రక్షణ కోసం సేవ చేయాలనుకునే యువతను బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. గతంలో రైతన్నలు, ఇప్పుడు సైనికులను నిర్లక్ష్యంగా చూడటం హేయమైన …

    Read More »
  • 17 June

    ‘అగ్నిపథ్‌’ పేరుతో యువత ఉసురు తీస్తున్నారు: మంత్రి నిరంజన్‌రెడ్డి

    బీజేపీ పాపం ముదిరి పాకాన పడిందని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మొన్నటి వరకు వ్యవసాయచట్టాలతో రైతుల ఉసురు పోసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘అగ్నిపథ్‌’ పేరుతో యువత ఉసురు తీస్తోందని ఆరోపించారు. ‘అగ్నిపథ్‌’ అనాలోచితమైన నిర్ణయమన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిరుద్యోగ యువకుల ఆందోళన నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 90 రోజుల్లోనే 46వేల మంది నియామకం చేపట్టి కేవలం రూ.30వేల జీతం ఇవ్వడం అర్ధరహితమన్నారు. దేశభద్రత విషయంలో ఇలాంటి …

    Read More »
  • 17 June

    తీవ్ర నిరుద్యోగ సంక్షోభానికి ఆ హింసే నిద‌ర్శ‌నం-మంత్రి కేటీఆర్‌

    ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా యువ‌త ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ అంశంపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంద‌ని, అగ్నివీర్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు ఆ తీవ్ర‌త‌ను సూచిస్తున్నాయ‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. తొలుత దేశ రైతుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఆడుకుంది. …

    Read More »
  • 17 June

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ విద్యార్థుల విద్వసం..

    అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్పడ్డారు.రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి నిరసన తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న దుకాణాల్లో వస్తువులు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.స్టేషన్‌లో ఆగిఉన్న రైళ్ల అద్దాలు పగులగొట్టారు. పోలీసులపై రాళ్లదాడిచేశారు. పార్సిల్‌ సామానుకు, హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వెళ్లే రైలుకు, ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు …

    Read More »
  • 17 June

    తెలంగాణలో త్వరలో 2వ విడత గొర్రెల పంపిణీ

    తెలంగాణలో 2వ విడత గొర్రెల పంపిణీ త్వరలో చేపట్టేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి అవసరమైన నిధులను ‘నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. రూ.5 వేల కోట్ల రుణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే NCDCకి అందించింది. NCDC అధికారి కూడా రాష్ట్రానికి వచ్చి పథకాన్ని పరిశీలించారు. తాజాగా రాష్ట్ర అధికారులు ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు.

    Read More »
  • 17 June

    తెలంగాణకు ఏడేళ్లలో రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు

    తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణలో దూసుకెళ్తాందని MSME ఎక్స్ ఫోర్ట్ కౌన్సిల్, బిల్ మార్ట్ ఫిస్టాక్ సంయుక్త అధ్యయనంలో తేలింది. 2014లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, టీఎస్ ఐపాస్ అమలుతో ఏడేళ్లలో రాష్ట్రానికి రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. వీటి వల్ల ఏడేళ్లలో 5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని తెలిపింది. 2021-22లో తెలంగాణ రూ. 11,964 కోట్ల విలువైన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat