TimeLine Layout

May, 2022

  • 12 May

    కాల్‌వే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన కాల్‌వే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్‌ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో డిజిటెక్‌ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. ఆపిల్‌, గూగుల్‌, ఉబర్‌, నోవార్టిస్‌ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్‌లు …

    Read More »
  • 12 May

    MLA Kpను కలిసిన సుభాష్ నగర్ ఆటో స్టాండ్ అసోసియేషన్ సభ్యులు…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ 130 డివిజన్ కు చెందిన సుభాష్ నగర్ ఆటో స్టాండ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం …

    Read More »
  • 12 May

    పుదీనా వల్ల లాభాలెన్నో..?

    పుదీనా ఆకుల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. మరి ఈ పుదీనా ఆకుల వలన ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?. పుదీనా ఆకుల్లో ఉండే సాలిసిలిక్ యాసిడ్ మొటిమలను నివారిస్తుంది. ఇందులోని మెంథాల్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది ముఖంపై మచ్చలను తగ్గిస్తుంది. చర్మం వృద్ధాప్య ప్రక్రియను నివారిస్తుంది. ఒక దోసకాయ ముక్క, 10 ఆకుల పూదీనా చూర్ణంలో తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 30నిమిషాల …

    Read More »
  • 12 May

    మీరు రక్త హీనతతో బాధపడుతున్నారా..?.

    మీరు రక్త హీనతతో బాధపడుతున్నారా..?. ఆ సమస్య మీకు చాలా ఇబ్బందిగా ఉందా..? . అయితే ఈ వార్త మీకోసం.. రక్తహీనతతో బాధపడేవారికి బచ్చలికూర దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బచ్చలికూర చక్కటి మెడిసిన్ పనిచేస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం నరాలు, మెదడు ఆరోగ్యానికి సాయపడుతాయి. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో …

    Read More »
  • 12 May

    మహేష్ బాబు వదులుకున్న చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్స్ – అవి ఏంటో మీకు తెలుసా.?

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా..కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సర్కారు వారి పాట. అయితే ఇప్పటివరకు మహేశ్ బాబు తనకు కథలు నచ్చక  వదిలేసుకున్న కొన్ని సినిమాలు ఘనవిజయం సాధించాయి. సర్కారు వారి పాట మూవీ విడుదల వేళ.. అభిమానులు ఆ సినిమాల గురించి …

    Read More »
  • 11 May

    అయ్యో.. మహేశ్‌బాబు అలా అనలేదు: స్పందించిన టీమ్‌

    ప్రముఖ నటుడు మహేశ్‌బాబు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంపై ఆయన టీమ్‌ స్పందించింది. మహేశ్‌బాబుకు అన్ని భాషలు సమానమేనని.. ఆయన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాధారంగా ‘మేజర్‌’ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మహేశ్‌బాబు నిర్మాతగా ఉన్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమానికి మహేశ్‌బాబు వెళ్లారు. ఆ తర్వాత ఈ మూవీపై …

    Read More »
  • 11 May

    మళ్లీ మా 151 సీట్లు మాకే: కొడాలి నాని

    జగన్‌ రాజకీయాల్లో లేకపోతే ఇళ్ల కోసం పేదల ప్రజలు అల్లాడిపోయేవారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్‌ కోసం పేద ప్రజలంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. గుడివాడలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. తన నియోజకవర్గంలో తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు అడిగినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని …

    Read More »
  • 11 May

    కర్ణాటకలో ఆ ప్రాజెక్టుల పర్మిషన్‌ నిలిపేయండి: తెలంగాణ అభ్యంతరం

    అంతర్రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్‌ గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా కర్ణాటకలోని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రం జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కర్ణాటకలో చేపడుతున్న అప్పర్‌తుంగ, అప్పర్‌ భద్ర ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన పర్మిషన్‌ను నిలిపివేయాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ లేఖ రాశారు. కర్ణాటకకు అనుమతిస్తే తుంగభద్ర నుంచి కృష్ణాకు …

    Read More »
  • 11 May

    అమిత్‌షాకు చంద్రబాబు లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు: సజ్జల

    ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్‌ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సజ్జల మాట్లాడారు. టెన్త్‌ …

    Read More »
  • 11 May

    ఆ ఆరోపణలు నిజం కావు.. వాటిని నమ్మొద్దు: గంగుల కమలాకర్‌

    ధాన్యం కొనుగోళ్లకు గన్నీ బ్యాగుల కొరత ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు నిజం కావని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ప్రస్తుతం 8.85 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా.. వాటిలో ఇప్పటివరకు కేవలం 2.5కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే వాడామని చెప్పారు. మిగిలిన 6.35కోట్ల బ్యాగులతో 25లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయొచ్చన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అసని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat