TimeLine Layout
April, 2022
-
29 April
CM KCR తో జార్ఖండ్ సీఎం భేటీ.. అసలు కారణం ఇదే..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి,ముఖ్యమంత్రి కేసీఆర్ తో జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నిన్న గురువారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భేటీ అయిన సంగతి విదితమే. ఈ సమావేశంలో ప్రస్తుత సమకాలిన జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం . మొన్న బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఆమోదించిన తీర్మానాలపై ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఆరా తీసినట్లు తెలుస్తుంది. దేశంలో …
Read More » -
29 April
హీరో నిఖిల్ ఇంట విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నిఖిల్ ఇంట విషాదం నెలకొన్నది. నిఖిల్ తండ్రి అయిన శ్యామ్ సిద్దార్థ నిన్న గురువారం కన్నుమూశారు. అయితే గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని నిమ్స్ లో చికిత్స తీసుకుంటున్న నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ నిన్న గురువారం మధ్యాహ్నాం తుది శ్వాస విడిచారు. నిఖిల్ కుటుంబానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ,ఎలక్ట్రానిక్ మీడియా …
Read More » -
28 April
నల్గొండలో అభివృద్ధి పనుల జాప్యంపై కేసీఆర్ అసంతృప్తి
నల్గొండ పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల్లో జాప్యం చేయడంపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై నార్కట్పల్లిలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మొదలు పెట్టిన పనుల పురోగతిని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. చిరుమర్తి లింగయ్య కుటుంబానికి పరామర్శ అంతకుముందు సీఎం …
Read More » -
28 April
గూగుల్తో ఒప్పందం.. మరింత మెరుగైన సేవలకు అవకాశం: కేటీఆర్
అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్కు గూగుల్ సంస్థ శ్రీకారం చుట్టింది. అమెరికాలోని మౌంటెన్వ్యూలోని తమ హెడ్క్వార్టర్ తర్వాత హైదరాబాద్లో 3.3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ను స్థాపించనుంది. ఈ క్యాంపస్కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. విద్య, పౌరసేవలతో పాటు ఇతర రంగాల్లో గూగుల్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి టెక్నికల్ …
Read More » -
28 April
ఎన్ని ఆటంకాలు వచ్చినా.. ఇచ్చిన మాట తప్పను: జగన్
తన పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో 25లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చామని.. అదనంగా మెరుగైన సౌకర్యాలతో కట్టిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారం లే అవుట్లో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో సొంతంగా ఇల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చామని.. ఇచ్చిన మాటకంటే మెరుగైన సౌకర్యాలతో కట్టించి తీరుతామని …
Read More » -
28 April
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం.. ఉక్కపోత నుంచి కాస్త రిలీఫ్
ఎండల వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. నగరంతో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్, ఈస్ట్ మారేడ్పల్లి, వెస్ట్ మారేడ్పల్లి,తిరుమలగిరి, అల్వాల్, బోయిన్పల్లి, చిలకలగూడ,బేగంపేట్, లంగర్హౌస్, కార్వాన్, గోల్కొడ ప్రాంతాల్లో వర్షం పడింది. ఆర్టీసీ క్రాస్రోడ్డు, ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్, భోలక్పూర్, బీఆర్కే భవన్, ట్యాంక్బండ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్నగర్ మొదలైన చోట్ల …
Read More » -
28 April
నా అభిమాని నా సినిమాలో నటించడం గర్వంగా ఉంది: చిరంజీవి
విలక్షణ నటుడు సత్యదేవ్ను మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో సత్యదేవ్ గెస్ట్ రోల్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి గొప్పతనాన్ని చెబతూ సత్యదేవ్ ట్వీట్ చేశారు. ‘‘అన్నయ్యా.. నటన, జీవితంలో మాలాంటి ఎందరికో మీరు ఆచార్య. ఒక అభిమానిగా చిరకాలం మీ పేరునే తలచుకుంటాను. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. మీరు నటించిన ‘ఆచార్య’లో కొద్దిసేపైనా మీతోపాటు కలిసి స్క్రీన్షేర్ …
Read More » -
28 April
ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు-మంత్రి తలసాని
పవిత్ర రంజాన్ సందర్భంగా ఈనెల 29న ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈమేరకు ఎల్బిస్టేడియంలో పెద్దయెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.మంత్రి తలసానితో పాటు హోంశాఖ మంత్రి మహమూద్అలీ గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం లు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు.తెలంగాణ …
Read More » -
28 April
కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలపై మంత్రి ఆరా తీశారు. వంద శాతం సాధించినట్లు మండల విద్యాధికారులు మంత్రికి వివరించారు. ఈ ఏడు బాసర ఐఐటీలో …
Read More »