రాష్ట్రంలో 91వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసేముందు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగార్థుల శిక్షణకు ఉస్మానియా, కాకతీయ, మహత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలుత పోలీసు, విద్య, వైద్యశాఖల్లోని ఖాళీలను భర్తీచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆమె చెప్పారు. ఈ మూడు శాఖల్లోనే …
Read More »TimeLine Layout
April, 2022
-
20 April
యాక్టివాకి ఫ్యాన్సీ నంబర్.. ఎంత పెట్టి కొన్నాడో తెలుసా?
మూమూలుగా అయితే కార్లకి, మొబైల్ ఫోన్కి ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఎవరి స్థాయి బట్టి వారు ఖర్చును భరించి తమకు కావాల్సిన నంబర్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటారు. ఆటో, బైక్ తదితర చిన్న వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ కావాలని ఎవరూ దాదాపుగా పట్టుబట్టరు. కానీ.. చండీగఢ్లో ఓ వ్యక్తికి ‘ఫ్యాన్సీ’ కిక్ ఉండటంతో భారీ మొత్తంలో చెల్లించి అనుకున్న నంబర్ను సొంతం చేసకున్నాడు. ఇంతకీ ఫ్యాన్సీ …
Read More » -
20 April
కేసీఆర్ పడే తపన.. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఉంటుందా?: కేటీఆర్
వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్జీ గ్యాస్ లైన్ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు సుమారు 43 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు …
Read More » -
20 April
అనిల్తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కాకాణి
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్తో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి అనిల్కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే వార్తల నేపథ్యంలో సీఎం వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలను వారిద్దరూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జగన్తో భేటీ అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. అనిల్ యాదవ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. తమ మధ్య …
Read More » -
20 April
దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేటలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు
దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేట పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎస్టీపీ ద్వారా శుద్ధిచేసిన మురుగునీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తామని మని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకం అన్నారు. చెత్తను మురుగునీటి …
Read More » -
20 April
మన కళలు, సాహిత్యం తెలంగాణ పంచ ప్రాణాలు – ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మరుగునపడ్డ మన సాహిత్యం కోటిప్రభలతో వెలుగొందుతుందని, మన చరిత్రను మనమే రాసుకుంటున్న చారిత్రక సందర్భం ఆవిష్కృతమైందని జాగృతి వ్యవస్థాపక అద్యక్షులు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కోటి ఉమెన్స్ కాలేజీ అద్యాపకురాలు డాక్టర్ ఎం. దేవేంద్ర రచించిన ‘‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ’’ అన్న పరిశోధనా గ్రంథాన్ని బుధవారంనాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన కళలు, సాహిత్యమన్నవి తెలంగాణ …
Read More » -
20 April
త్వరలో 13 వేల టీచర్ పోస్టులు భర్తీ-మంత్రి హరీష్ రావు
అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలి.. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని సూచించారు మంత్రి హరీష్రావు.. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్ళి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం డైనింగ్ హాల్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను కొంత వరకైనా …
Read More » -
20 April
మేం నామినేటెడ్ వ్యక్తులం కాదు: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం మంచి పద్ధతి కాదన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిధికి లోబడి …
Read More » -
20 April
కొత్త సెక్రటేరియట్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలి
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారికి సూచించారు. మంగళవారం ముఖ్యమంత్రి నూతన సెక్రటేరియట్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును కూలంకశంగా, సూక్ష్మంగా పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం, పలు …
Read More » -
20 April
తెలంగాణ పట్ల ఆగని మోదీ వివక్ష: మంత్రి కేటీఆర్
నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ .. నిరాటంకంగా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూనే ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్లోని జామ్నగర్లో సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ప్రారంభిచడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. సంప్రదాయ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి …
Read More »