వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే వన్డే, టీ20 టీంలను బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులను సెలెక్ట్ చేసింది.వన్డే టీం: రోహిత్ శర్మ (C), కేఎల్ రాహుల్ (VC), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (WK), దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, …
Read More »TimeLine Layout
January, 2022
-
27 January
బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతు
విరాట్ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతుగా నిలిచారు. ‘అభిమానులు వరల్డ్ కప్ వంటి ఐసీసీ ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నారు. అంతేకానీ ర్యాంకులు, సిరీస్ల గురించి కాదు. అందుకే కోహ్లి ఇబ్బంది పడుతున్నాడు. ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడమే కోహ్లిపై వేటుకు కారణం. బీసీసీఐ అతడిని తప్పించి రోహిత్ పగ్గాలు అప్పగించడం సరైందే’ అని ఆయన అన్నారు.
Read More » -
27 January
పైనాపిల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
పైనాపిల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం 1. రోగనిరోధకశక్తికి అవసరమయ్యే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 2. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. 3. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం దరిచేరదు. 4. చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.
Read More » -
27 January
ఒమిక్రాన్ సోకినవారిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి
ఒమిక్రాన్ కారణంగా పేషెంట్లో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు డెల్టా వేరియంట్ సహా ఇతర అన్ని హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాయని ICMR అధ్యయనంలో తేలింది. ఒమిక్రాన్ సోకినవారిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవుతోందని ICMR తెలిపింది. మరోవైపు వ్యాక్సిన్ తయారీ, పంపిణీ విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఒమిక్రాన్ లక్ష్యంగా రూపొందించుకోవాలని పేర్కొంది.
Read More » -
27 January
వారంలో ఏకంగా 2.1 కోట్ల మందికి కరోనా
ప్రపంచవ్యాప్తంగా గత వారంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగాయి. జనవరి 17 నుంచి 23 వరకు ఏకంగా 2.1 కోట్ల మంది కరోనా బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడించాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఒక వారంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని WHO పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ వల్లే కేసులు ఊహించనంతగా పెరిగాయని తెలిపింది. ఇదే వారంలో ప్రపంచవ్యాప్తంగా 50 వేల మంది కరోనాతో …
Read More » -
27 January
ఒమిక్రాన్ తగ్గిన కానీ తప్పని ఆందోళన
ఒమిక్రాన్ బారినపడినా.. 3-4 రోజుల్లోనే ఎక్కువమంది కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా మందిలో గొంతుకే పరిమితమవడంతో .. ఆస్పత్రుల్లో చేరికలు స్వల్పంగా ఉంటున్నాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు తగ్గినా.. దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటివి మాత్రం వదలట్లేదు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడితే నయమవుతుందంటున్నారు నిపుణులు.
Read More » -
27 January
ఎంపీ అర్వింద్ కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సవాల్
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ధర్మపురి ఎంపీ అర్వింద్, రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డిని 50 వేల మెజార్టీతో ఓడిస్తానన్న అర్వింద్ వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి స్పందించారు. ‘ఆర్మూర్ లో పోటీ చేస్తానన్న అర్వింద్ సవాల్ స్వీకరిస్తున్నా. ఆయనకు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తా’ అని …
Read More » -
27 January
మళ్లీ తెరపైకి ఎమ్మెల్యే ఈటల రాజేందర్
దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైని అవమానించే రీతిలో ప్రవర్తించారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. రాజ్ భవన్ కు రాకుండా కేసీఆర్ ప్రగతి భవన్లో వేడుకలు జరుపుకోవడం గవర్నర్ వ్యవస్థను అవమానించడమేనని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన పదవులను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ మంత్రిని కూడా పంపించలేదని విమర్శించారు.
Read More » -
27 January
అక్కడ అమ్మాయికి జన్మనిస్తే రూ.11,116 లు ఆర్థిక సాయం
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మం. మద్దిగట్లకు చెందిన యువకులు ఓ మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఊళ్లో ఆడపిల్ల పుడితే రూ.11,116 చొప్పున ఆర్థికసాయం చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 19 మంది ఆడపిల్లలకు రూ.2,11,204లను వారి తల్లిదండ్రులకు అందజేశామని చెప్పారు. దీనికి ‘అభయహస్తం’ అనే పేరు పెట్టారు. ఇందుకోసం గ్రామ యువకులంతా కమిటీగా ఏర్పడి డబ్బు జమచేసుకుంటున్నారు. కొందరు దాతలు కూడా ఈ మంచిపనిలో భాగమవుతున్నారు.
Read More » -
27 January
కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం
కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం, దక్షిణ భారత దేశంలో ద్వితీయ, జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలువడం గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు పేర్కొన్నారు. సీఎం ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని, ఈ విజయాన్ని కేసీఆర్కే అంకితం చేస్తున్నామని ప్రకటించారు. వ్యాక్సినేషన్లో జిల్లా సాధించిన విజయానికి గుర్తుగా బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లో అధికారులతో కలిసి …
Read More »