TimeLine Layout

January, 2022

  • 23 January

    తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం

    ఏపీలో చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేపుతోంది. ఐఐటీ క్యాంపస్లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. 40 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్ గా తేలింది. వీరందర్నీ క్యాంపస్ లోని ఐసోలేషన్లో ఉంచారు. ఈ నెల మొదటి వారంలో 600 మంది విద్యార్థులు సొంత ఇళ్లకు వెళ్లడంతో కొందరు మాత్రమే క్యాంపస్లో ఉన్నారు.

    Read More »
  • 23 January

    నేడే సౌతాఫ్రికాతో 3వ వన్డే

    వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడిన టీమ్ ఇండియా.. సౌతాఫ్రికాతో 3వ వన్డే ఆడేందుకు సిద్ధమైంది. కేప్ టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. నామమాత్రపు ఆఖరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ కూడా గెలిచి వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని అతిథ్య సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. మరి ఈ మ్యాచ్లోనైనా రాహుల్ సేన గెలుస్తుందో …

    Read More »
  • 23 January

    టీమిండియాకు కల్సి రావడం లేదా..?

    టీమిండియా గత కొంత కాలంగా విదేశీ గడ్డపై వన్డే సిరీస్ లో విఫలం అవుతోంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో జరిగిన వన్డే సిరీస్లలో విజయాలు దక్కలేదు. 2018లో  ఇంగ్లాండ్ తో  1-2, 2020లో న్యూజిలాండ్ తో 0-3, ఆస్ట్రేలియాతో 1-2, ప్రస్తుతం సౌతాఫ్రికాతో 0-2 తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ మొత్తం 23 వన్డేలు ఆడగా 11 వన్డేల్లోనే …

    Read More »
  • 23 January

    సీఎం అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా

    ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత  అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ తెలిపారు. ఇటీవల చరణ్ సన్నిహితుల ఇంట్లో ఈడీ దాడులు జరగ్గా.. ‘నిజాయితీ లేని వ్యక్తి’ అని కేజీవాల్ విమర్శించారు. దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కేజీవాల్ వ్యాఖ్యానించారని.. ఆయనపై దావా వేస్తానని చరణ్ జిత్ చెప్పారు. గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేసి.. కేజీవాల్ క్షమాపణలు …

    Read More »
  • 23 January

    తొలిసారి అసెంబ్లీ నుండి బరిలోకి అఖిలేష్ యాదవ్

    ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నసమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం  అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన మైన్ పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అఖిలేష్ ఇప్పటివరకు ఎమ్మెల్యేగా బరిలో నిలవలేదు. 2012లో ఎమ్మెల్సీ హోదాలోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు సీఎం యోగి గోరఖ్ పూర్ నుంచి …

    Read More »
  • 23 January

    రతన్ టాటా గురించి మీకు తెలియని Top-7 అంశాలు

    ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి మీకు తెలియని Top-7 అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..? 1. విమానంలో ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తారు 2. కారులో వెనకాల కాకుండా డ్రైవర్ పక్కనే కూర్చుంటారు. 3. పిల్లలు, తల్లులకు పోషకాహారం కోసం కార్యక్రమాలు 4. సొంత కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తారు. 5. కరోనా సమయంలో రూ.500 కోట్లు విరాళమిచ్చారు. 6. ఏ కంపెనీ కూడా అర్థిక భారం అని చెప్పి ఉద్యోగుల …

    Read More »
  • 23 January

    2024లో ఖాతా కూడా తెరవని జనసేన -Latest సర్వే..?

    దేశ వ్యాప్తంగా 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో  ప్రస్తుత అధికార పార్టీ అయిన నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. ఈ క్రమంలో ఇండియా టుడే ఏపీ గురించి కూడా ప్రస్తావించింది.ప్రధానమంత్రి మోదీ మ్యాజిక్ ఏపీలో ఏ మాత్రం పనిచేయదని పేర్కొంది. బీజేపీ, జనసేన కూటమి ఒక్క ఎంపీ సీటులోనూ విజయం సాధించదని తెలిపింది. పోటీ …

    Read More »
  • 22 January

    కొత్త జోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్ -ఎడిటోరియల్ కాలమ్

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందుకే తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగసింది. 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమానికి కేంద్ర తల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వనరులను సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి సారించారు. రూ. లక్ష పై చిలుకు కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి …

    Read More »
  • 22 January

    యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

    యూపీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి తాను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని మీడియాతో అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్త వహిస్తోంది.

    Read More »
  • 22 January

    విటమిన్ డి ఎక్కువైన నష్టమే..?

    మన శరీరానికి కావాల్సిన ముఖ్య పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఎండలో గడపడం ద్వారా విటమిన్ డి లభిస్తుంది. వైద్యుల సూచన మేరకు కొందరు ఇమ్యూనిటీకి, శరీర దృఢత్వానికి సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నారు. అయితే విటమిన్ డి ఎక్కువ కావడం వల్ల ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఒళ్లు నొప్పులు, కండరాలు బలహీనంగా మారడం, ఎముకల్లో నొప్పి, పెళుసుతనం, కిడ్నీలు చెడిపోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయంటున్నారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat