రిలయన్స్ జియో నవంబర్ 20.19 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఎయిర్టెల్కు కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరగా, వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
Read More »TimeLine Layout
January, 2022
-
20 January
మరో ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
వన్డేల్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ (5,065) పేరిట ఉన్న రికార్డును దాటేశాడు. ధోనీ (4,520), రాహుల్ ద్రావిడ్ (3,998), సౌరభ్ గంగూలీ(3,468) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Read More » -
20 January
గరిక గడ్డితో లాభాలెన్నో..?
గరిక గడ్డితో ఒక కప్పు కషాయం చేసుకుని రోజూ తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. తీవ్రమైన తలనొప్పి తగ్గిపోతుంది. చర్మంపై ఏర్పడే పొక్కులు, అలర్జీలు, దద్దుర్లు, గాయాల వంటి వాటిపైన గరిక చూర్ణంలో నెయ్యి కలిపి రాస్తే తగ్గిపోతాయి. అరకప్పు నీటిలో ఒక స్పూన్ గరిక పొడి వేసుకుని తాగితే అల్సర్లు తొలగిపోతాయి. గరిక పేస్టును ఒక కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే మహిళల్లో వైట్ డిశ్చార్జి సమస్య పరిష్కారమవుతుంది.
Read More » -
20 January
ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై సంచలన తీర్పు
ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దంపతులు, వారి కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మి వేసిన గృహ హింస కేసు రుజువైంది. దీంతో ఆమెకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే పిటిషనరు, ఆమె కుమార్తెకు ప్రతివాదుల ఇంటిలో నివాస వసతి కల్పించాలని స్పష్టం చేసింది. లేదంటే నెలకు రూ. 50వేలు చెల్లించాలని పేర్కొంది.
Read More » -
20 January
బీజేపీలో చేరిన దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్
దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. సైన్యంలో కల్నల్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆయన ప్రధాని మోదీ ఆలోచనా విధానం నచ్చే కమలం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Read More » -
20 January
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,17,532 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 30వేల కేసులు పెరిగాయి. ఇక కొత్తగా 491 మంది వైరస్లో మరణించారు. మరోవైపు తాజాగా 2,23,990 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరింది.
Read More » -
20 January
తెలంగాణలో కొత్తగా 3,557 మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,557 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 574 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,11,178 టెస్టులు నిర్వహించారు.
Read More » -
20 January
ఏపీలో స్కూళ్లకు సెలవులపై మంత్రి సురేష్ క్లారిటీ
ఏపీ రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిని ప్రతిరోజూ కలెక్టర్ స్థాయి అధికారులతో సమీక్షిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ‘సంక్రాంతి తర్వాత 80% మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. కరోనా వచ్చిన టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో శానిటైజ్ చేస్తున్నాం. కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం. మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు’ అని మంత్రి అన్నారు.
Read More » -
20 January
ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 1.8 కోట్ల కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా గత వారం 1.8 కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు WHO తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే కేసులు 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది. మరణాల సంఖ్య స్థిరంగా 45 వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఆఫ్రికా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుతోందని, కేసులు కూడా తగ్గుతాయని అభిప్రాయపడింది.
Read More » -
20 January
దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు
ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం .. మహారాష్ట్రలో 43,697 కరోనా కేసులు కర్ణాటకలో 40,499 కరోనా కేసులు కేరళలో 34,199 కరోనా కేసులు గా గుజరాత్లో 20,966 కరోనా కేసులు తమిళనాడులో 26,981 కరోనా కేసులు ఉత్తరప్రదేశ్లో 17,776 కరోనా కేసులు ఢిల్లీలో 13,785 కరోనా కేసులు ప. బెంగాల్లో 11,447 కరోనా కేసులు ఆ ఏపీలో 10,057 తెలంగాణలో 3557 కరోనా కేసులు
Read More »