బరువు తగ్గాలంటే కష్టంగానీ పెరగడానికి ఏముందిలే అనుకుంటే పొరపాటే. ఏది పడితే అది తింటే బరువు పెరగడం ఏమోగానీ ఊబకాయులుగా మారుతారు. అందుకే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సమయానికి తినాలి. మధ్య మధ్య లో పండ్లు, ఇతర స్నాక్స్ తీసుకోండి. కానీ అందులో జంక్ ఫుడ్ చేర్చవద్దు. ఇక పాల ఉత్పత్తులు, ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్లు తినండి. తరచూ ఇవి తీసుకోవడం వల్ల బరువు, …
Read More »TimeLine Layout
January, 2022
-
19 January
శ్రీలంకకు అండగా భారత్
విదేశీ మారక ద్రవ్యం కొరత, పెరిగిన అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు మరోసారి భారత్ సాయం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వనుంది. ఈ నెల మొదట్లో ఆ దేశానికి 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ను, గత వారం 400 మిలియన్ డాలర్లను భారత్ మంజూరు చేసింది. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు ఇబ్బందులు …
Read More » -
19 January
ప్రసాద్ వి.పోట్లూరి (పీవీపీ)పై కేసు నమోదు
ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ వి.పోట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీవీపీ తన అనుచరులను పంపి బెదిరిస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ కూతురు శృతిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన అనుచరులు తమ గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించి ప్రహరీ గోడ కూడా కూల్చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పీవీపీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More » -
19 January
నాగ్ సరసన సోనాల్ చౌహాన్
ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో స్టార్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్స్పైకి వెళ్లనున్నది.. ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం చిత్ర యూనిట్ సోనాల్ చౌహాన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముందుగా కాజల్ను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ చందమామ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. …
Read More » -
19 January
2013లో సమంత చేసిన “‘నేను పెళ్లి చేసుకుంటా… విడాకులు కూడా తీసుకుంటా”‘ ట్వీట్ వైరల్
గతంలో వివాహం, విడాకులపై ఇటీవల అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయిన సీనియర్ స్టార్ హీరోయిన్.. హాట్ బ్యూటీ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2013లో సామ్ అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘నేను పెళ్లి చేసుకుంటా… విడాకులు కూడా తీసుకుంటా. చూస్తూ ఉండండి మనిద్దరం కలిసి డాన్స్ చేస్తాం’ అని రిప్లై ఇచ్చింది. అయితే గతేడాది నాగచైతన్యతో సమంత …
Read More » -
19 January
రూ.3కోట్లకు తగ్గేదేలే అంటున్న సమంత
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ,రష్మిక మందాన హీరో హీరోయిన్లుగా నటించగా సునీల్ ,రావు రమేష్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కి ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసింది సీనియర్ హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా సమంత మరో క్రేజీ రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’లో సామ్ తొలిసారి ప్రెగ్నెంట్గా కనిపించనుందట. అందుకోసం మేకోవర్ కూడా …
Read More » -
19 January
బీజేపీలోకి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ బీజేపీలో చేరారు. ఈయన 2017 శిరోమణి అకాలీదళ్ చేరి… అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అమరీందర్పై పటియాలా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జోగిందర్ 2005 నుంచి 2007 వరకు ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. 2008-13 మధ్య అరుణాచల్ గవర్నర్ గా ఆయన సేవలందించారు.
Read More » -
19 January
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు వన్డే మ్యాచ్
మూడు వన్డే మ్యాచ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లి సాధారణ బ్యాటర్గా బరిలో దిగనున్నాడు. కెప్టెన్ రాహుల్, ధావన్ ఓపెనింగ్ చేయనున్నారు. ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ …
Read More » -
19 January
సీఎం జగన్ కు నాగార్జున కృతజ్ఞతలు
తెలుగు సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని చెప్పిన ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున కృతజ్ఞతలు చెప్పారు. తాను,తన తనయుడు అక్కినేని నాగచైతన్య,సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ,యువహీరోయిన్ కృతిశెట్టిలు నటించగా విడుదలై ఘన విజయం సాధించిన బంగార్రాజు సక్సెస్ మీట్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ వేడుకలో ఏపీ సీఎంతో జరిగిన …
Read More » -
19 January
కరోనా చికిత్సపై కేంద్రం కీలక ప్రకటన
కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ను ఉపయోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా సవరించిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. రోగికి స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఇవ్వడంతో బ్లాక్ ఫంగస్ వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కొవిడ్ సోకిన వారికి రెండు, మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే టీబీ, ఇతర పరీక్షలు చేయాలని సూచించింది.
Read More »