TimeLine Layout

November, 2021

  • 29 November

    BigBoss కి యాంకర్ రవి ఎంత తీసుకున్నాడో తెలుసా..?

    ఎవరు ఊహించ‌ని ట్విస్ట్‌తో బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన యాంక‌ర్ ర‌వి పారితోషికం ప్ర‌స్తుతం చర్చ‌నీయాంశంగా మారింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట! వారానికి రూ. 7 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట. మ‌రో రెండు వారాలు ఉంటే చాలా మొత్తం చెల్లించాల్సి ఉంటుంద‌ని భావించిన బిగ్ బాస్ యాజ‌మాన్యం ఊహించ‌ని ఎలిమినేష‌న్‌తో బ‌య‌ట‌కు పంపించిన‌ట్టు టాక్స్ న‌డుస్తున్నాయి. ర‌వి బిగ్ బాస్ …

    Read More »
  • 29 November

    దేశంలో కొత్తగా 8309 కరోనా కేసులు

    దేశంలో కొత్తగా 8309 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,80,832కు చేరింది. ఇందులో 3,40,08,183 మంది కోలుకున్నారు. మరో 1,03,859 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4,68,790 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 9905 మంది కరోనా నుంచి బయటపడగా, 236 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్‌ కేసులు 544 రోజుల కనిష్ఠానికి చేరాయని …

    Read More »
  • 29 November

    కెనడాలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌

    ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కెనడాలో (Canada) ప్రత్యక్షమయింది. దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్‌ (Omicron) కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా నుంచి ఒంటారియోకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో సరికొత్త వైరస్‌ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఈ మధ్యకాలంలో వారు కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ఆరోగ్యశాఖ మంత్రి జీన్‌ వెస్‌ తెలిపారు. మానిటరింగ్‌, టెస్టింగ్‌ ప్రక్రియ …

    Read More »
  • 29 November

    నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం..

    తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ఈ సమావేశంలో వరి ధాన్యం సేకరణ విషయంలో కేందప్రభుత్వ వైఖరిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా వత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. యాసంగిలో వరిధాన్యం తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పటంతో ఇతర పంటల సాగుపై రైతులకు సూచనలు చేసే విషయంపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. …

    Read More »
  • 29 November

    రైతన్న కోసం రణమే.. పార్లమెంటులో గళమెత్తండి- సీఎం కేసీఆర్‌

    ఆహారధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వ అయోమయ, అస్పష్ట విధానం తెలంగాణ రైతాంగానికే కాకుండా.. యావత్‌ దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఆహారధాన్యాల సేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, పార్లమెంటు వేదికగా ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ …

    Read More »
  • 28 November

    YSRCP MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి అస్వస్థత

    ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి అధికార YSRCP MLA ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్కే పాల్గొన్నారు.

    Read More »
  • 28 November

    కొత్త వేరియంట్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

    కొత్త వేరియంట్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి కొన్ని దేశాల్లో అత్యంత ప్రమాదకరమైన ఒమిన్ అనే కొత్త కరోనా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని WHO సూచించింది. 1. పండుగలు, ఇతర వేడుకలు కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహణ 2. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరంగా ఉండటం. 3. ప్రభుత్వాలు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేలా చూడటం. 4. వైరస్ వ్యాప్తికి …

    Read More »
  • 28 November

    రోజూ శృంగారంలో పాల్గొంటున్నారా?

    రోజూ శృంగారంలో పాల్గొంటున్నారా? .ప్రతి రోజు శృంగారంలో పాల్గొనే దంపతులకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 1. ఒత్తిడి దూరమై మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 2. మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారై, యూరిన్ లీకేజీ సమస్య ఉంటే తగ్గిపోతుందట. 3. సెక్స్ వల్ల ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల లెవెల్స్ సరిగా ఉంటాయట. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందట. 4. రోజంతా ఉల్లాసంగా, చలాకీగా ఉంటారట.

    Read More »
  • 28 November

    బీపీ, షుగర్ పేషెంట్లకు డిసెంబర్ నుంచి ఉచితంగా మెడిసిన్ కిట్లు

    తెలంగాణ రాష్ట్రంలో బీపీ, షుగర్ పేషెంట్లకు డిసెంబర్ నుంచి దశల వారీగా ఉచితంగా మెడిసిన్ కిట్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 20 లక్షల మంది బీపీ రోగులు, 7 లక్షల మంది షుగర్ రోగులు ఉన్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ సర్వేలో తేలింది. వీరికి ప్రభుత్వం ఇచ్చే కిట్లో నెలకు సరిపడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకునే బీపీ, షుగర్ మందులు ఉంటాయి. గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ …

    Read More »
  • 28 November

    స్టార్టప్లకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం

    స్టార్టప్లకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 400 స్టార్పలు పని చేస్తున్నాయని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ప్రభుత్వం స్టార్ట్ సేవలను వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అదే విధంగా కంపెనీలు కూడా స్టార్టీల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat