ప్రతిష్టాత్మక ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి వస్తే టోల్ రూపంలో నెలకు దాదాపు రూ.1,000-1,500 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎక్స్ ప్రెస్ వేల వల్ల ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణ సమయం 24 గం. నుంచి 12 గం.కు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం టోల్ ఫీజుల ద్వారా NHAIకి ఏటా రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోందని, అది వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని …
Read More »TimeLine Layout
September, 2021
-
20 September
మెగాస్టార్ ఎమోషనల్ -ఎందుకంటే..?
ఏ విపత్తు వచ్చినా మొదట స్పందించే సినీ పరిశ్రమే ఇప్పుడు కష్టాల్లో ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కరోనా వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, నష్టపోయిన పరిశ్రమను తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆదుకోవాలని కోరారు. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ప్రస్తుతం సినిమాలు తీయాలంటే ఆలోచించాల్సి వస్తోందన్నారు. అయినా అభిమానులను నిరాశపర్చకుండా, వినోదాన్ని పంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Read More » -
20 September
మెగాస్టార్ కి షాకిచ్చిన ‘ఫిదా’ బ్యూటీ
యువనటుడు అక్కినేని నాగచైతన్య ,అందాల రాక్షసి సాయిపల్లవి జంటగా నటించి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా మూవీలో ఓ చెల్లి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు. ఆమె ఒప్పుకోకుంటే బాగుండు అనుకున్నా. ఆమె రిజెక్ట్ చేసిందని తెలియగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్తో డ్యాన్స్ వేయాలి అనుకుంటా గాని చెల్లెలిగా అంటే …
Read More » -
20 September
రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి తాను సిద్ధమని.. ఎయిమ్స్ టెస్టు కోసం రాహుల్ గాంధీ వస్తే తానూ వస్తానన్నారు. చర్లపల్లిలో జైలు జీవితం గడిపిన వ్యక్తులు రాహుల్ను ఒప్పించాలన్నారు. తాను టెస్టు చేయించుకుని క్లీన్ చీట్ వస్తే పదవి నుంచి తప్పుకుంటారా అని అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని …
Read More » -
20 September
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 64 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మరో 64 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 1,39,981 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More » -
19 September
దేశంలో కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా మరింతగా తగ్గింది. కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గతంలో 25 వేలకు పడిపోయిన కరోనా పాజిటివ్ కేసులు రెండు రోజులపాటు పెరిగి, 35 వేలకు పైగా చేరుకున్నాయి. తాజాగా కరోనా కేసులు నమోదులో క్షీణత కనిపించింది. తాజాగా 31 వేలకు దిగువగా కరోనా కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ ముప్పు …
Read More » -
19 September
బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర
బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈసారి వేలంలో లడ్డూను లడ్డూను.. 18లక్షలా 90వేల రూపాయాలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశ్ లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్ కృపతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. లడ్డూను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి …
Read More » -
19 September
నువ్వు అడ్డగాడిదవా? సంకర గాడిదవా?
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే వారిపై రాజద్రోహం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గుడ్డలూడదీసి కొడుతామని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనను డ్రగ్స్ అంబాసిడర్ అనటంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని, మరి కాంగ్రెస్నేత రాహుల్గాంధీ కూడా పరీక్షకు సిద్ధమా? అని సవాలు విసిరారు. రూ.50 …
Read More » -
19 September
పీసీసీ కొనుక్కున్నోడు.. టికెట్లు అమ్ముకోడా.. రేవంత్పై కేటీఆర్ సెటైర్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్కు వచ్చాడా.. ఫామ్ హౌస్లో ఉన్నాడా కాదు.. పనులు అవుతున్నాయా? లేదా? చూడాలన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని తాగుబోతు అనడం సరికాదన్నారు. ఎవర్నీ వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతాం.. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడుతామని …
Read More » -
19 September
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
చిన్నపిల్లల వస్ర్తాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ కిటెక్స్ మనరాష్ట్రంలో తన పెట్టుబడిని రెండింతలు చేసింది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో వరంగల్ టెక్స్టైల్ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలోని సీతారామపురంలో కర్మాగారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. కంపెనీల స్థాపన కోసం రాష్ట్రప్రభుత్వంతో శనివారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణ్ణ హోటల్లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కిటెక్స్ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు …
Read More »