వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ తుది దశలో ఉండగా, క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు మూవీ కూడా మరి కొద్ది రోజులలో పూర్తి కానుంది.దీని తర్వాత పవన్.. . హరీష్ శంకర్ మూవీ మొదలు పెట్టనున్నాడు.ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఇటీవల భీమ్లా నాయక్కు సంబంధించి క్రేజీ …
Read More »TimeLine Layout
September, 2021
-
6 September
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కేసీఆర్ కలిశారు. రీజినల్ రింగ్ రోడ్డును ఆమోదించినందుకు గడ్కరీకి సీఎం కృతజ్ఞతలు తెలపనున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు నిధులు కోరే అవకాశం ఉంది. నూతన జాతీయ …
Read More » -
6 September
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిఅన్నారు. బాన్సువాడ నియోజక వర్గానికే పదివేల ఇండ్లు మంజూరయ్యాయని, అర్హులైన వారందరికీ ఇండ్లను ఇస్తామని ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ నియోజక వర్గం పరిధిలోని వర్ని మండలంలోని ఎస్ఎన్ పురం, హుమ్నాపూర్, రాజ్ తండా, శంకోర తండా లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. …
Read More » -
6 September
గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చేపట్టి అమలు చేస్తున్న వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంకితభావంతో, చిత్తశుద్ధితో కృషిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న 57 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు డిప్యూటీ చీఫ్ …
Read More » -
6 September
కృతిశెట్టితో మూవీకి నో చెప్పిన విజయ్ సేతుపతి
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మొన్నటి వరకు తమిళ ప్రేక్షకులని మాత్రమే అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా, నెగెటివ్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే విజయ్ సేతుపతి సినిమాకు 17 ఏళ్ల కృతిశెట్టిని హీరోయిన్గా ఎంపిక చేశారట. ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించి,ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయడం చాలా కష్టం అని …
Read More » -
6 September
పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిసి అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రంతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయక్ అనే టైటిల్తో ఈ చిత్రం రూపొందుతుండగా, ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే.భీమ్లా …
Read More » -
6 September
సాయంత్రం కేంద్రమంత్రులను కలవనున్న సీఎం కేసీఆర్
ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, రాత్రి 7 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం కేసీఆర్ కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లనున్నారు. గత గురువారం ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్.. …
Read More » -
6 September
హైదరాబాద్.. తయారీ హబ్
తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో హైదరాబాద్ మహానగరం దేశంలోనే ముందంజలో ఉందని జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. భారతీయ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు తర్వాత రెండో సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ నిలిచింది. ఐటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా దేశంలోనే స్టార్టప్లకు హబ్గా హైదరాబాద్ ఎదిగింది. ఐటీ రంగంతోపాటు ఫార్మా, బయోటెక్, ఏరోస్పేస్, రక్షణ, ఈఎస్డీఎం, మెడికల్ డివైజెస్ రంగాలకు సంబంధించిన విభాగాల్లో మంచి పనితీరును …
Read More » -
6 September
కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశాం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. సనత్నగర్ సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్తో పాటు 7 అంబులెన్స్లను మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్లను మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ …
Read More » -
6 September
దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,40,752 మంది వైరస్ వల్ల మరణించారు. ఇక ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 43,903 మంది కోలుకోగా, 219 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 26,701 పాజిటివ్ …
Read More »