తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి వేదికపై భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ వేదికపై దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి.. 15 మంది లబ్దిదారులకు చెక్కులను అందించనున్నారు. ఈ పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 20 వేలకు పైగా దళిత కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
Read More »TimeLine Layout
August, 2021
-
16 August
మన అడుగుతో అన్ని రాష్ట్రాల్లో అగ్గి రాజుకుంటుంది: సీఎం కేసీఆర్
హుజూరాబాద్లో శ్రీకారం చుట్టిన దళితబంధు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘ఇది ఒక సువర్ణ అవకాశం. మన నిర్ణయంతో భారత దళిత జాతి మేల్కొంటుంది. ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అగ్గి రగులుకుంటుంది. పిడికెలిత్తి అడుగుతది. దళిత బిడ్డలకు లాభం జరుగుతది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మీరు చాలా బాధ్యతగా హుజూరాబాద్లో విజయవంతం చేసి చూపి పెట్టాలె. …
Read More » -
16 August
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
దళిత బంధు పథకం ప్రారంభోత్సవ వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ బొజ్జా దళితుడే. వాళ్ల నాన్న బొజ్జా తారకం.. ఉద్యమంలో పని చేసిన వారికి న్యాయవాదిగా ఉండే. గొప్ప న్యాయవాది. ఆయన కుమారుడే రాహుల్ బొజ్జా. రాహుల్ బొజ్జా ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండటమే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే …
Read More » -
16 August
దళితబంధును విజయవంతం చేసే బాధ్యత దళిత యువతదే: సీఎం కేసీఆర్
దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళిత బంధును విజయం సాధించితీరుతది. నిన్ననే 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. ఈ 75 ఏండ్లలో భారతదేశంలో ప్రధాని, పార్టీ కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా? కనీసం వాళ్ల మైండ్కైనా వచ్చిందా? ఆ దిశగా …
Read More » -
16 August
ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధు వర్తింపు : సీఎం కేసీఆర్
ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధును వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ రోజు హుజూరాబాద్ వేదికగా దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పథక అమలు తీరును వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘హుజూరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రెండు నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం. హుజూరాబాద్ కాడ అందరికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు …
Read More » -
16 August
హుజూరాబాద్కు 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు: సీఎం కేసీఆర్
హుజూరాబాద్లో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. దళితబంధు పథక ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ‘హుజూరాబాద్ ప్రజలు సాధించే విజయం భారతదేశ దళిత ఉద్యమానికి పునాది పడుతుంది. హుజూరాబాదే పునాది రాయి అవుతుంది. నియోజకవర్గంలో 21 వేల కుటుంబాలు ఉన్నట్లు లెక్క ఉన్నది. ఇంకో రెండు మూడు వేల కుటుంబాలు పెరిగే అవకాశం ఉంది. రూ.500 …
Read More » -
16 August
దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది: కేసీఆర్
భవిష్యత్లో భారత్లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ నాల్గో దశలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఎస్సీలకు దళితబంధు ఇస్తామని ప్రకటించారు. రాబోయే 15 రోజుల్లో ఇంకో రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని, దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలన్నారు. దళితబంధు ఇస్తామనగానే కిరికిరిగాళ్లు కొండి పెడుతున్నారని దుయ్యబట్టారు. …
Read More » -
16 August
ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్దీ్ప రాజన్
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ఐడల్ సీజన్-12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు ఫైనల్కు చేరగా.. ఉత్తరాఖండ్కు చెందిన పవన్దీ్ప రాజన్ విజేతగా నిలిచారు. రెండోస్థానంలో అరుణిత కాంజీలాల్, మూడోస్థానంలో సయాలీ కాంబ్లే, నాలుగోస్థానంలో మహ్మద్ దానిష్, ఐదో స్థానంలో నిహాల్ తౌరో నిలిచారు. విజేతగా నిలిచిన పవన్దీ్ప రూ.25 లక్షల నగదు, మారుతి సుజుకీ స్విఫ్ట్ కారు గెలుచుకున్నాడు. దాదాపు 12 …
Read More » -
16 August
‘మాస్ట్రో’ లో మిల్క్ బ్యూటీ
బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్గా నితిన్ 30వ చిత్రం ‘మాస్ట్రో’ రూపుదిద్దుకొంది. ఇందులో నభా నటేశ్ హీరోయిన్గా, తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ సరికొత్త పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మాస్ట్రో’ టీమ్ నుంచి విడుదలైన తమన్నా తొలి లుక్ ఇదే! నల్ల కళ్లద్దాలతో భయపడుతూ నిల్చున్న నితిన్, అతని పక్కనే గన్ పట్టుకుని తమన్నా.. …
Read More » -
16 August
కాంగ్రెస్ పార్టీకి షాక్
కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుస్మితా దేవ్ 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్ ఇండియా మహిళా …
Read More »