అందాల రాక్షసి.. యువతరం అభిమాన నాయక రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్లో ‘గుడ్బై’ సినిమా షూటింగ్ను పూర్తిచేసుకొని హైదరాబాద్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్నది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో మొదలైంది. తాను ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు రష్మిక మందన్న …
Read More »TimeLine Layout
July, 2021
-
20 July
తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ప్రజలకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగ అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని సీఎం ప్రార్థించారు. రాష్ర్ట వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Read More » -
20 July
పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. నెలకు రూ.28,719 వేతనాన్ని ఖరారుచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇన్చార్జి కార్యదర్శి, కమిషనర్ రఘనందన్రావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.15 వేల వేతనాన్ని చెల్లించారు. పెరిగిన వేతనం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు లబ్ధి …
Read More » -
19 July
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ-ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర,ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. కొన్ని రోజుల క్రితం ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఓ …
Read More » -
19 July
దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు
ఇండియాలో గడిచిన 24 గంటల్లో 38,164 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. ఇక మరో 499 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు, మరణాల సంఖ్య 4.14 లక్షలకు చేరింది. అత్యధికంగా కేరళలో 13,956 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర 9 వేల కేసులతో రెండోస్థానంలో ఉంది. 24 గంటల్లో కేసుల …
Read More » -
19 July
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
దేశంలోనే మొదటి సారిగా దళిత బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని టీఆర్ఎస్ నేత ఎల్. రమణ అన్నారు. ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలన్న సీఎంకేసీఆర్ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. ఈ పథకం చరిత్రలో గొప్ప మైలు రాయిగా నిలిచి పోతుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన నేతగా కేసీఆర్ తరతరాలకు …
Read More » -
19 July
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయండి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. లోక్సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఎంపీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కొన్ని సదుపాయాలు కల్పిస్తే టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందుతుందన్నారు. కాళేశ్వరం ఆలయం నుంచి లక్ష్మీ బరాజ్ వరకు 22 కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్ …
Read More » -
19 July
దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది బాహుబలులు ఉన్నారు-ప్రధాని మోదీ
టీకాలను భుజాలకు ఇస్తారని, అయితే కోవిడ్ టీకాలను వేయించుకున్నవాళ్లు బాహుబలులు అయినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉంటారని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని, దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారని, వాళ్లంతా బాహుబలులు అయినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని, …
Read More » -
19 July
కొవిషీల్డ్ పై గుడ్ న్యూస్
భారత్లో కొవిషీల్డ్గా వ్యవహరించే ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్తో వైరస్ నుంచి జీవితకాలం పూర్తి రక్షణ లభిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్ను నిరోధించే యాంటీబాడీలను తగినంత అభివృద్ధి చేయడంతో పాటు నూతన వేరియంట్లను సైతం వెంటాడి చంపేలా శరీరంలో శిక్షణా శిబిరాలను సృష్టిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. యాంటీబాడీలు అంతరించినా కీలక టీసెల్స్ను శరీరం తయారుచేస్తుందని, ఇది జీవితకాలం సాగుతుందని జర్నల్ నేచర్లో ప్రచురితమైన కధనంలో ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు …
Read More » -
19 July
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ మరోసారి క్లారిటీ
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తుంది. రేపో మాపో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని అభిమానులు ముచ్చటించుకుంటన్న సమయంలో ఇటీవల బాలకృష్ణ తన తనయుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు. క్లాసిక్ మూవీతో తన తనయుడిని బాలయ్య ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని తెలుసుకొని ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు.ఆదిత్య 369 చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో, …
Read More »