అందాల రాక్షసి.. యువతరం అభిమాన నాయక రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్లో ‘గుడ్బై’ సినిమా షూటింగ్ను పూర్తిచేసుకొని హైదరాబాద్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్నది.
తెలుగులో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో మొదలైంది. తాను ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు రష్మిక మందన్న ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది.
ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా వినోదానికి పెద్దపీట వేస్తూ రూపొందించబోతున్నారు.