గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఇవాళ రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. వరంగల్ నగర పరిధిలోని 66 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు కాగా, 65వ డివిజన్ ఎస్టీ మహిళకు, 2వ డివిజన్ ఎస్టీ జనరల్కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజన్లు ఎస్సీ మహిళలకు, 15, 17, 18, 37, 47, 53 డివిజన్లను ఎస్సీ …
Read More »TimeLine Layout
April, 2021
-
15 April
సరికొత్త పాత్రలో కాజల్ అగర్వాల్
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ‘ ఘోస్టి’ అనే హర్రర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘గులేబకావళి, జాక్పాట్ ‘ల దర్శకుడు కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ పోలీస్ అధికారిగా అలరించనుంది. యోగిబాబు, ఊర్వశి, శ్రీమాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టే దెయ్యాలను ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా కట్టడి చేసిందనేదే కథ. ఈ మూవీ తెలుగు, తమిళంలోనూ అదే పేరుతో విడుదల కానుందని చిత్రబృందం …
Read More » -
15 April
కరోనాపై దాదా సంచలన వ్యాఖ్యలు
కరోనా ఓ వరం అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు హాటాపిక్ అయ్యాయి. ముంబైలో రాత్రి కర్ఫ్యూ, స్టేడియాల వద్ద ఫ్యాన్స్ కోలాహలం లేకపోవడంతో క్రికెటర్ల రవాణా సులభం అవుతుంది. ఆటగాళ్లు స్టేడియం నుంచి హోటల్స్ వెళ్లడానికి, ప్రాక్టీసు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అందుకే కరోనా ఓ వరమని గంగూలీ అన్నారు. ఇక TV వీక్షకుల సంఖ్య ఒక్క మ్యాచ్ కి 30 నుంచి 50 …
Read More » -
15 April
రికార్డు సృష్టించిన పాక్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 203/5 పరుగులు చేసింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్.. 18 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 59 బంతుల్లో 122 పరుగులతో చెలరేగాడు. టీ20ల్లో పాకిస్థాన్కు అత్యధిక రన్ ఛేజింగ్ ఇదే కావడం విశేషం. ఈ విజయంతో 4 …
Read More » -
15 April
పవన్ పై శృతి సంచలన వ్యాఖ్యలు
అందాల నటి శృతిహాసన్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ హిట్ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు.. ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో చిటాచాట్ చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలని ఓ నెటిజన్ కోరాడు. దీనికి సమాధానంగా.. మహేష్ బాబు ఓ జెంటిల్మెన్, పవన్ ఓ ఎపిక్ అని బదులు ఇచ్చింది. శృతి ప్రస్తుతం ‘సలార్’లో నటిస్తోంది.
Read More » -
15 April
సీఎం కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కేసీఆర్ పై ఆమె మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం,ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణ వచ్చిన వెంటనే పదవి నుంచి తప్పించారన్నారు. అదే మంత్రి మల్లారెడ్డిపై వందల ఆరోపణలొస్తున్నా.. బర్తరఫ్ చేయట్లేదు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో లోటస్ పాండ్ లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి …
Read More » -
15 April
దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం …
Read More » -
15 April
మత్తెక్కిస్తున్న ఇస్మార్ట్ భామ
ఇటీవల విడుదలైన రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ అమ్మడు నన్ను దోచుకుందువటే చిత్రంతో కుర్రకారు హృదయాలు దోచుకుంది. ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి ఇస్మార్ట్ శంకర్ చిత్రం అందించిన సక్సెస్ మరే చిత్రం …
Read More » -
15 April
రైతుల పాదాలు కడుగుతున్నాం : సీఎం కేసీఆర్
గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. రైతుల పాదాలను కడుగుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరంలో రైతులు కేరింతలు కొట్టినట్లే.. సాగర్లో కూడా రైతులు, ప్రజలు కేరింతలు కొట్టాలి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలైందంటే …
Read More » -
15 April
రేషన్ కార్డులపై సీఎం కేసీఆర్ శుభవార్త
కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 57 ఏండ్ల వయసు ఉన్న వారికి పెన్షన్లు కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. హరితహారం, పల్లె ప్రకృతి …
Read More »