TimeLine Layout

April, 2021

  • 15 April

    అచ్చంపేట అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శ్రీ‌కారం

    అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ‌కారం చుట్టారు. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్క‌ర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ …

    Read More »
  • 15 April

    తెలంగాణలో కొత్తగా 3,037 కరోనా కేసులు

    తెలంగాణలో  కొత్త‌గా 3037 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. బుధ‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎనిమిది మంది బాధితులు మ‌ర‌ణించ‌గా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి. ఇందులో 1788 మంది బాధితులు వైర‌స్‌వ‌ల్ల మ‌ర‌ణించ‌గా, మ‌రో 3,08,396 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 27,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 18,685 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. కొత్త‌గా …

    Read More »
  • 15 April

    తెలంగాణలో ఇప్పటివరకు కట్టినవి డబుల్‌ ఇండ్లు 1.56 లక్షలు

    తెలంగాణ రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకంతో లక్షల మంది సొంతింటి కల సాకారం అవుతున్నది. 2016లో పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 1,56,573 ఇండ్లు కట్టించింది. ఇందులో 1,02,260 ఇండ్ల నిర్మాణం 90 శాతం పూర్తికాగా, 54,313 ఇండ్ల నిర్మాణం వందశాతం పూర్తయింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 2,86,057 ఇండ్లు మంజూరవగా ప్రభుత్వం రూ.10,054.94 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన ఇండ్ల నిర్మాణం …

    Read More »
  • 13 April

    దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులు

    దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు ఏప్రిల్ నెలలో 9 రోజులపాటు సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.మంగళవారం ఏప్రిల్ 13 నుంచి 16వతేదీ వరకు నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు 4రోజులపాటు వరుస సెలవులు …

    Read More »
  • 13 April

    పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

    ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఈ పాత్రకు ఎటువంటి స్పందన వస్తుందో తెలియంది కాదు. తాజాగా వకీల్‌ సాబ్‌ చిత్రంలోని తన పాత్ర గురించి, అలాగే తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..  ప్రేక్షకులు …

    Read More »
  • 13 April

    తెలంగాణ  ప్రజ‌ల‌కు మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ఉగాది శుభాకాంక్షలు

    తెలంగాణ  రాష్ట్ర ప్రజ‌ల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ప్లవ‌నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.నీరు స‌మృద్ధిగా ప్రవ‌హించ‌డం ఈ సంవ‌త్సర ప్రాధాన్యంగా పంచాంగం చెప్తున్న ‌నేప‌థ్యంలో తెలంగాణ వ్యవ‌సాయానికి సాగునీరు మ‌రింతగా లభించ‌నుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంద‌రూ ఉగాది పండుగ‌ను ఆనందోత్సాహాల మధ్య కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ జ‌రుపుకోవాల‌ని కోరారు. తెలుగు సంవ‌త్సరంలో ప్రజ‌లంద‌రూ ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.క‌రోనా మ‌హమ్మారిని ధైర్యం ఎదుర్కొని విజ‌యం …

    Read More »
  • 13 April

    తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై ఉగాది శుభాకాంక్షలు

    తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలకు, ఆనందాలకు ప్రతీకగా జరుపుకొనే ఉగాది తెలుగువారికి పవిత్రమైన పండుగగా అభివర్ణించారు. ఈ ఉగాది కొవిడ్‌ వైరస్‌ నుంచి మానవజాతికి రక్షణ కల్పించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. కొవిడ్‌ రెండోదశను ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్రమత్తంగా వ్యవహరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా …

    Read More »
  • 13 April

    కార్గోలో బాలామృతం కిట్లు

    తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు అన్ని రంగాలకు విస్తరిస్తున్నాయి. కూరగాయలు మొదలు ఉచిత పాఠ్యపుస్తకాల వరకు అన్నింటినీ కార్గో ద్వారా జిల్లాలకు రవాణాచేస్తున్నారు. టీఎస్‌ ఫుడ్‌ ఆధ్వర్యంలో తయారవుతున్న బాలామృతం కిట్లు కూడా జిల్లాలకు కార్గోలో రవాణాచేస్తున్నారు. అక్కడి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపుతున్నారు. బాలామృతాన్ని 9 నెలల నుంచి ప్రతిరోజూ దాదాపు 40 టన్నుల వరకు కార్గో ద్వారా విజయవంతంగా రవాణాచేస్తున్నారు. ఇందుకు 10 నుంచి 15 కార్గో …

    Read More »
  • 13 April

    సీఎం కేసీఆరే మాకు ఆదర్శం -మంత్రి హారీష్

    తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబవుతుందని పాడిన పాటను, కేసీఆర్‌ కలలు గన్న సిద్దిపేటను ఇవాళ నిజం చేస్తూ పట్టణ ప్రజలకు అందిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట కోమటి చెరువుపై గ్లోగార్డెన్‌ను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌రాజుతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. …

    Read More »
  • 13 April

    సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం .రేషన్ కార్డు లేకున్నా సరే..?

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూల్‌ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వ అందించే 25 కిలోల సన్న బియ్యం ఆహార భద్రతా కార్డు/ రేషన్‌కార్డు లేకున్నా ఇవ్వాలని  నిర్ణయించారు. టీచర్లు, సిబ్బంది నివాస ప్రాంతాలకు సమీపంలోని రేషన్‌షాపుల్లోనే బియ్యాన్ని అందజేయనున్నారు. చాలామంది ప్రైవేటు స్కూల్‌ సిబ్బందికి రేషన్‌కార్డులు లేవు. దరఖాస్తుల్లో భాగంగా రేషన్‌కార్డు/ ఆహార భద్రతా కార్డు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat