TimeLine Layout

March, 2021

  • 24 March

    బాలీవుడ్ లోకి నాగబాబు ఎంట్రీ

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు నాగబాబు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్ తో ఆయన బీటౌన్ లోకి వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని హిందీలోకి రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ రీమేక్ ను డైరెక్టర్ వి.వి.వినాయక్ రూపొందించనున్నాడు. ఇందులో నాగబాబు విలన్ పాత్ర పోషిస్తాడట.

    Read More »
  • 24 March

    కొత్తిమీర జ్యూస్ తాగితే..?

    కొత్తిమీర జ్యూస్ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్, లిపిడ్ లెవల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. కొత్త మీరలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తాయి. పరగడుపున తాగితే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

    Read More »
  • 24 March

    పసుపు పాలతో లాభాలెన్నో..?

    పసుపు పాలతో హాయిగా నిద్ర పాలలో సెరొటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్ తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దీంతో రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది. అలాగే పసుపులో ఉండే కుర్ క్యుమిన్ శరీరంలోని వైరస్ వృద్ధిని అరికడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. దగ్గు, జలుబు తగ్గుతాయి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు …

    Read More »
  • 24 March

    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో మరో 111 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,901 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. సెకండ్ వేవ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    Read More »
  • 24 March

    వ్య‌వసాయ యాంత్రీక‌ర‌ణ‌ను ప్రోత్స‌హిస్తున్నాం-మంత్రి నిరంజ‌న్ రెడ్డి

    శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణకు సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌లో భాగంగా హార్వెస్ట‌ర్లు, ఇన్నోవ‌ర్స్, రీప‌ర్ల వంటి ఆధునిక వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు రైతుల‌కు అంద‌జేశామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 6,66,221 మంది రైతులు ల‌బ్ది పొందార‌ని తెలిపారు. వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ కోసం రూ. 951 కోట్ల 28 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశామ‌న్నారు. 2021-22 సంవ‌త్స‌రానికి కార్యాచ‌ర‌ణ ప్ర‌క్రియ …

    Read More »
  • 24 March

    ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్-మంత్రి హరీశ్ రావు.

    ఉద్యోగుల సంక్షేమాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ప్రభుత్వం తమదని, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్ మెంట్ ను ఇస్తూ పీఆర్సీపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పీఆర్పీని ఆహ్వానిస్తూ అరణ్య భవన్ లో ఉద్యోగుల సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ పక్షపాతి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది గల వ్యక్తని చెప్పారు. ప్రభుత్వ …

    Read More »
  • 24 March

    తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 431 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. కొత్తగా 228 మంది హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 2,99,270 మంది కోలుకున్నారని చెప్పింది. 24 గంటల్లో మరో ఇద్దరు వైరస్‌ బారినపడి మృత్యువాతపడగా.. మొత్తం మృతుల …

    Read More »
  • 24 March

    దేశంలో కరోనా విజృంభణ

    దేశంలో మహమ్మారి ఏమాత్రం ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్‌ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అలాగే ఒకే రోజు పెద్ద ఎత్తున 275 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన మొత్తం కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,17,34,058కు పెరిగింది. మరో 23,907 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు …

    Read More »
  • 24 March

    తెలంగాణ రాష్ట్రంలో మరో గాజు పరిశ్రమ

    తెలంగాణ రాష్ట్రంలో మరో పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చింది ప్రముఖ పారిశ్రామిక సంస్థ హెచ్‌ఎస్‌ఐఎల్‌ గ్రూప్‌. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భువనగిరిలో రూ.230 కోట్లతో గాజు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ సందీప్‌ సోమానీ తనకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 700 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. హెచ్‌ఎస్‌ఎల్‌ గ్రూప్‌ రాష్ట్రంలో ఏడోసారి పెట్టుబడి పెట్టేందుకు …

    Read More »
  • 24 March

    శభాష్ కేటీఆర్ – అందరూ ఫిదా

    తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన  బండలింగంపల్లి నివాసులైన చింతల విజయ్‌-సంగీత దంపతులు తమ కొడుకు మౌలిక్‌(6) మెదడు సంబంధిత వ్యాధితో నాలుగేండ్లుగా బాధపడుతున్నాడు.. ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించినా కోలుకోలేదని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి.. మౌలిక్‌ చికిత్సకు తప్పకుండా సహకరిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమన్వయ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat