TimeLine Layout

March, 2021

  • 18 March

    అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు

    2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం 11:30 గంటలకు బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన మండలిలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. కరోనా నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. గతేడాదికంటే మెరుగైన బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

    Read More »
  • 18 March

    ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్‌: మంత్రి హరీశ్ రావు

    జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. మంత్రి హరీశ్‌ రావు ఇవాళ ఉదయం 11.30 గంటలకు శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో 2021-22 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టబోతున్నామని …

    Read More »
  • 17 March

    కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టికి సీఎం కేసీఆర్ చుర‌క‌లు

    కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌కు సీఎం కేసీఆర్ శాస‌న‌స‌భ‌లో చుర‌క‌లంటించారు.  గవ‌ర్నర్‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై ఎమ్మెల్యే భ‌ట్టి మాట్లాడుతూ.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్య‌వ‌సాయ రంగం గురించి గొప్పగా చెప్పారు. అయితే కేంద్రం తెచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు చాలా ఇబ్బందిక‌రంగా ఉన్నాయి. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వేల సంఖ్య‌లో రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. రైతులు ఆందోళ‌న చెందుతున్నారు అని భ‌ట్టి వ్యాఖ్యానించారు.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ …

    Read More »
  • 17 March

    జూనియర్ ఎన్టీఆర్ కి పారితోషికం ఎంతో తెలుసా..?

    ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఎన్టీఆర్ కోసం షో నిర్వాహకులు రూ.7.5 కోట్లను పారితోషికంగా ఇవ్వనున్నట్లు సమాచారం. 60 ఎపిసోడ్లుగా ఈ సీజన్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి రూ.9 కోట్లు నాగార్జున రూ.4.5 కోట్లు తీసుకున్నట్లు టాక్. బిగ్ బాస్ కోసం NTR రూ.4 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి

    Read More »
  • 17 March

    చంద్రబాబు హత్యకు కుట్ర..?

    ఏపీ మాజీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. ఈ  నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును ఏదో రకంగా అంతమొందించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 150 మంది ఎమ్మెల్యేలున్నా జగన్ కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని …

    Read More »
  • 17 March

    బుమ్రా సతీమణి సంజన గురించి మీకు తెలియని విషయాలు..?

    టీమిండియా స్టార్ బుమ్రా పెళ్లి చేసుకున్న సంజనా గణేశన్ ఎవరు? అని నెటిజన్లు చర్చిస్తున్నారు. సంజనా స్టార్‌ స్పోర్ట్స్ లో టీవీ ప్రజెంటర్ గా చేస్తోంది. గతేడాది దుబాయ్లో జరిగిన ఉమెన్ టీ20 wcకు ప్రజెంటర్గా పని చేసింది. 1991 మే 6న పుణెలో జన్మించిన సంజనా బీటెక్ వరకు చదివింది. మోడలింగ్ లో కెరీర్ మొదలుపెట్టి ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్ టైటిల్ గెలుచుకుంది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో …

    Read More »
  • 17 March

    పెళ్లి తర్వాత రెచ్చిపోతున్న కాజల్ అగర్వాల్

    టాలీవుడ్ లో మరో సినిమాకు కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రవీణ్ సత్తారు-అక్కినేని నాగార్జున కాంబో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ షూటింగ్ లో కాజల్ జాయిన్ కానుందట. ఈ చిత్రాన్ని శరత్ మరార్-సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు.

    Read More »
  • 17 March

    మంచి నిద్రకు ఏం చేయాలి

    మంచి నిద్రకు ఏం చేయాలి రోజూ పడుకునే సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి పగటిపూట నిద్రపోవడం మానేయాలి నిద్రకు ముందు కాఫీ/టీ తాగడం మానేయాలి రోజూ కాసేపు వ్యాయామం చేయాలి ఎక్కువ సమయం టీవీలు, మొబైల్స్ చూడకూడదు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి రాత్రిళ్లు మాంసాహారం తినకూడదు

    Read More »
  • 17 March

    ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరుతోంది.

    ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరుతోంది.వారి కష్టాలు తొలగి పోనున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆమోదం లభించడంతో వారు త్వరలో స్వరాష్ట్రం తెలంగాణకు చేరను న్నారు.ప్రాంత ఉద్యోగులను తెలంగాణకు రప్పించే కసరత్తు వేగవంతమైంది.ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ లేఖ రాసి తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు పంపించాలని కోరారు.ఈ లేఖకు సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎస్‌ ఉద్యోగుల తిరిగి పంపించే అంశంపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.తెలంగాణ …

    Read More »
  • 17 March

    నెయ్యితో లాభాలెన్నో..?

    నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. బరువు తగ్గేందుకు సహాయపడతాయి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉంచుతుంది. వెంట్రుకలను ఆరోగ్యంగా చేస్తుంది వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా కాపాడుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది ఉదయాన్నే నెయ్యి తీసుకుంటే మలబద్ధకం ఉండదు రోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్లు తీసుకోండి

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat