తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని 15 నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహం వద్దే మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లేజర్ షో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. …
Read More »గోమయ గణేష్ విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రి ఐకే రెడ్డి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి, గోమయ గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని క్లిమోమ్ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో గోమయ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి, క్లిమోమ్ నిర్వాహకురాలు దివ్యారెడ్డి, అల్లోల గౌతంరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోమయ గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుగ్..పర్యావరణానికి మేలు …
Read More »జల సంపదతో పాటు మత్స్య సంపదను పెంచుతాం
జల సంపదతో పాటు మత్స్య సంపదను పెంచుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని వెల్టూరు గోపాల సముద్రం, పెబ్బేరు మహా భూపాల సముద్రం, జానంపేట రామసముద్రం, శ్రీ రంగాపురం రంగసముద్రం, వనపర్తి నల్లచెరువు, గోపాల్ పేట కత్వ చెరువు, పొలికెపాడు మొగుళ్ల చెరువు, బుద్దారం పెద్ద చెరువులలో 5.50 లక్షల చేప పిల్లల విడుదల చేసి మాట్లాడారు. చెరువులు, కుంటలే మత్స్యకారులకు జీవనాధారం. గత …
Read More »హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు శుభవార్త
తెలంగాణ వ్యాప్తంగ ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు విద్యనందించడలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలకనిర్ణయం తీసుకున్నది. ఈ విద్యార్థులకు సర్కారు స్కూళ్లల్లో పాఠాలు చెప్పించడమే కాకుండా అక్కడే వారికి మధ్యాహ్న భోజనాన్ని సైతం సమకూర్చాలని నిర్ణయించింది. ఇటీవలే పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఈవోలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ 1 నుంచి రాష్టంలోని విద్యాసంస్థలు ప్రారంభంకాగా, విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం …
Read More »ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గోదావరి, …
Read More »చేనేత రంగానికి రూ.73.42 కోట్లు విడుదల
చేనేత రంగానికి చెందిన వివిధ పథకాల కోసం ప్రభుత్వం రూ.73.42 కోట్లు విడుదలచేసింది. హాంక్ నూలు, రంగులకు 20 శాతం సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు, మారెటింగ్ ప్రోత్సాహక పథకం, టెసో ఎక్స్ గ్రేషియాలు, చేనేత మిత్ర, క్యాష్ క్రెడిట్ రుణాలు, నేతన్నకు చేయుత తదితర పథకాలకు ఈ నిధులను ఖర్చుచేస్తారు. ఈ పథకాలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుతో కలిసి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో సమీక్ష …
Read More »సహాయక చర్యలు ముమ్మరం చేయండి.!
ప్రస్తుతం వర్షం నేపథ్యంలో తెలంగాణలో,హైదరాబాద్ మహనగరంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించండి. సిరిసిల్ల పట్టణంలో వరద ఉదృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫిరెన్స్ .వరద ప్రభావిత కాలనీలకు హైద్రాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందం తరలింపు.వరద నీరు మల్లింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచన. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు …
Read More »మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం
ప్రతీ ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి పది వరకు వాహనాల రాకపోకలను నిలిపేసి కేవలం సందర్శకులు ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఆదివారం ట్యాంక్బండ్పై నగర పౌరులు కుటుంబ సభ్యులతో సందడి చేశారు. సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫొటోలను ట్విటర్లో పోస్టు చేసిన కేటీఆర్ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్సాగర్లో లేజర్ షో …
Read More »సాయంత్రం కేంద్రమంత్రులను కలవనున్న సీఎం కేసీఆర్
ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, రాత్రి 7 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం కేసీఆర్ కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లనున్నారు. గత గురువారం ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్.. …
Read More »కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశాం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. సనత్నగర్ సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్తో పాటు 7 అంబులెన్స్లను మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్లను మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ …
Read More »