సంప్రదాయ నీటిపారకంతో పోల్చితే బిందుసేద్యం (డ్రిప్) ద్వారా పంటలసాగు ప్రయోజనకరమని, రైతుకు రెట్టింపు ఆదాయం సమకూరుతుందని నాబ్కాన్స్ సంస్థ స్పష్టంచేసింది. తెలంగాణలో బిందుసేద్యంతో రైతులు ఏటావివిధ రూపాల్లో రూ.9,549 కోట్లు ఆదాచేస్తున్నట్టు తెలిపింది. నాబ్కాన్స్ రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల మంది రైతులు 3.75 లక్షల ఎకరాల్లో బిందుసేద్యం ద్వారా పంటలసాగుపై సర్వే నిర్వహించింది. నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి అందజేసింది. 2016-17 నుంచి 2018-19 వరకు నాబార్డ్ అందించిన రూ.874 కోట్ల …
Read More »పర్యాటక ప్రాంతంగా కీసర ఫారెస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారంతో రాష్ట్రం ఆకుపచ్చని తెలంగాణగా మారుతున్నదని ఎంపీ సంతోష్కుమార్ తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర రిజర్వు ఫారెస్ట్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామ ని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కీసర ఆధ్యాత్మిక శైవక్షేత్రంగా కీర్తి గడిస్తున్నదని, భవిష్యత్లో ఆధ్యాత్మికతతోపాటు ఆకుపచ్చని ఆహ్లాదాన్ని పంచే నందనవనంగా మారుతుందని ఆకాంక్షించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్-3లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో కలిసి శుక్రవారం తూంకుంట, బిట్స్ …
Read More »ఇప్పుడు రాజ్ నీతి కాదు రణ్ నీతి కావాలి -సీఎం కేసీఆర్
భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. …
Read More »యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి
హైదరాబాద్ సంక్షేమ భవనం లోని సమావేశ మందిరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇచ్చే పలు సంస్థల ప్రతినిధులతో, ఎస్సి కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి, మరియు ఇతర ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ అధికారులకు …
Read More »ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
తుముకుంట మున్సిపాలిటీ పరిధిలో మరియు కీసరలో దత్తత తీసుకున్న ప్రాంతంలో మంత్రి మల్లారెడ్డి తో కలిసి మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుంది .. మొక్కలు నాటే యజ్ఞం ప్రారంభమైంది , అందులో భాగంగా ఈరోజు తుముకుంట మున్సిపాలిటీ పరిధిలోని బిట్స్ పిలానీ వద్ద మరియు తాను దత్తత తీసుకున్న కీసరగుట్ట …
Read More »ఆదర్శంగా ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ఖానపురం రోడ్ లో రూ.3.75 కోట్లతో నిర్మించిన రెండు వైపులా డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్, నూతన బ్రిడ్జి, సైడ్ డ్రైన్ ను మేయర్ పాపాలాల్ గారితో కలిసి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నడూ లేని విధిగా కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సుందర నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని …
Read More »తెలంగాణలో రైతుబంధు మార్గదర్శకాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వారం, పది రోజుల్లోనే ఈ నగదును రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో జనవరి …
Read More »తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 269 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. తాజాగా మరో నలుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 192కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు 3,071మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రల్లో 2,412మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »సంతోశ్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం
భారత – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని… ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా …
Read More »ఉపాధి పని కూలీలకు మంత్రి ఎర్రబెల్లి భరోసా
ఉపాధి కూలీలకు కనీసం రూ.200 లకు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వెళ్తున్న మంత్రి మార్గ మధ్యంలో ఉప్పరపల్లి వద్ద ఆగి ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. రోజు వారీగా ఎంత మేరకు ఉపాధి లభిస్తున్నదని …
Read More »