Home / Tag Archives: apcm

Tag Archives: apcm

చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు

ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా అంగళ్ళులో ఇటీవల జరిగిన ఘటనలో ముదివీడు ఠాణాలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఏ వన్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏ టూ గా దేవినేని ఉమ … ఏ త్రీ గా అమర్ నాథ్ రెడ్డి.. ఏ ఫోర్ గా రాంగోపాల్ రెడ్డిని …

Read More »

ఏపీ వైసీపీకి షాక్

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి భారీ షాక్‌కు తగిలింది. విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు, పంచకర్ల రమేశ్‌ బాబు పార్టీ నుంచి వైదొలిగారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. గురువారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా విషయాన్ని రమేశ్‌ బాబు ప్రకటించారు. పెందుర్తి నియోజకవర్గంలో కొంతకాలంలో వైసీపీ నేతల మధ్య వర్గ పోరు నడుస్తోంది. వచ్చే …

Read More »

టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు

 ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటే మంచిదేనని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా  స్పష్టం చేశారు. అయితే తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు  ఎక్కడ పోటీ …

Read More »

టీడీపీ-జనసేన పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో గత నాలుగేండ్ల  వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ-జనసేన పొత్తు అవసరమని  కాపు నేత చేగొండి హరిరామజోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అయితే రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ‘టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే …

Read More »

లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్

govt permission nara lokesh yuva galam padayatra

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ .. ఆ పార్టీకి చెందిన సీనియర్  నేత నారా లోకేశ్ పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి దక్కింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న  కుప్పం నుంచి ఈ నెల 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. …

Read More »

 కల్లు గీత కార్మికులకు రూ.10 లక్షలు

ఏపీలో కల్లు గీత కార్మికులు కల్లు గీస్తూ.. ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే రూ.10,00,000 పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5,00,000, ఎక్స్రేషియా రూపంలో మరో రూ. 5,00,000 చెల్లించనుంది. కాగా, కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం రూ.10,00,000 పరిహారం అందిస్తోంది. తాజాగా శాశ్వత వైకల్యం బారిన పడినా రూ.10 …

Read More »

రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిస్తే.. ఎన్ని స్థానాలు వస్తాయంటే..?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం.. ప్రముఖ స్టార్ హీరో నాయకత్వంలోని జనసేన పార్టీ కలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలోస్తాయో చెప్పారు అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.  దేశ రాజధాని నగరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ  ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా జనసేన కల్సి బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తృత స్థాయి శాంపిల్స్ తో …

Read More »

ఏపీలో ఒమిక్రాన్ కలవరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది.

Read More »

అందులో ఏపీ ముందు

ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ విభాగంలో 0.634 స్కోరుతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  ప్రథమ స్థానంలో నిలవగా, 0.413 స్కోరుతో  తెలంగాణ   7వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు 2019లో 6.3% ఉండగా 2021లో 11.3%కి చేరింది. ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7%నుంచి 12.3%కి పెరిగింది. పాల ఉత్పత్తి …

Read More »

చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి వ్యాఖ్యలపై YSRCP MLA క్లారిటీ

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి తానేమీ మాట్లాడలేదని, చంద్రబాబే అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ) అన్నారు. అసెంబ్లీలో జరిగింది వేరు, బయట ప్రచారం చేస్తున్నది వేరని వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబం, భువనేశ్వరి అంటే తనకు గౌరవముందని చెప్పారు. కాగా, ‘లోకేశ్ ఎలా పుట్టాడో తెలుసా?’ అంటూ అసెంబ్లీలో ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat