అక్కినేని నాగ చైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6న గోవాలో జరిగిన సంగతి తెల్సిందే. ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు తప్ప వేరే వారికి ఆహ్వానం పంపలేదు. దీంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం వీరి పెళ్లి చూడలేకపోయామే అని బాధపడ్డారు. అయితేనేం రిసెప్షన్ ఉంది కదా అని అనుకున్నారు. పెళ్లి కి ముందు చైతు, సామ్ పెళ్లి సింపుల్ గా జరిగిన రిసెప్షన్ మాత్రం చాల పెద్ద ఎత్తున చేస్తామని చెప్పారు.
అయితే.. ఈ రిసెప్షన్ కు అన్ని ఇండస్ట్రీ ల ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులకు ఆహ్వానం పంపిస్తామని నాగ్ తెలిపినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఇప్పుడు పెళ్లి జరిగి వారం కావొస్తున్నా రిసెప్షన్ ఊసే ఎత్తడం లేదు చైతూ, సామ్లు. ఇక గురువారం జరిగిన రాజాగారి గది 2 ఈవెంట్లో రిసెప్షన్ ఎప్పుడా అని నాగ్ ను మీడియా అడిగితే చైతూ, సమంతలు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు రిసెప్షన్ ఉంటుందని నాగ్ చెప్పడం తో అసలు రిసెప్షన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎలాగూ పెళ్లి అయిపోయింది.. రిసెప్షన్ అవసరమా అని అనుకుంటున్నారా.. అని అంత మాట్లాడుకుంటున్నారు.