రంగుల ప్రపంచంలో గుర్తింపు రావాలంటే ఎవరో ఒకరికి అదృష్టం ఉంటుంది కానీ..చాలా మంది సినిమా కష్టాలు,సీరియళ్ కష్టాలు పడి వచ్చినవాళ్లే..తెలుగు టీవి యాంకర్లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ,అనసుయ,రష్మిలే..స్మాల్ స్క్రీన్ ని దున్నేస్తున్నారు. చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ వీరిలా ఓకే ప్రోగ్రాంలో ఏళ్లకేళ్లు ఉండిపోలేదు..ఇప్పుడు వీళ్లకు పోటీగా అనిపిస్తోంది యాంకర్ విష్ణుప్రియ.
తెలుగు బుల్లితెర పై వస్తున్న పోవే పోరా ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్ణుప్రియ అంతకు ముందు ఎవరీకి తెలియదు. ఈ ప్రోగ్రాం కన్నా ముందు సీరియల్స్, వెబ్ సిరీస్లో నటించింది విష్ణుప్రియ. అయితే తనకి ఇప్పుడొచ్చినంత పేరు రాలేదు.. తన స్పాంటేనియస్ మాటలతో అందరిని ఆకట్టుకుంటుంది. తనదైన స్టైల్లో హావభావాలు పలికిస్తూ అటు కుర్రకారుని ఇటు పెద్దవారిని తన యాంకరింగ్తో ఆకట్టుకుంటుంది.
ఇక విష్ణు ప్రియకి సంభందించిన ఒక మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అదే డబ్బుల కోసం తను భగవద్గీత చెప్పేదని.చిననాటి నుండి తన తాతగారి దగ్గర భగవద్గీతలోని అన్ని అధ్యయనాలు నేర్చుకుందట. అవే పిల్లలకు చెప్పేది.. అలా చెప్పడానికి తను ఎంత తీసుకునేది తెలుసా ఒక్కొక్కరి దగ్గర పదిహేను వందల రూపాయలు. అదే భగవద్గీతకి సంభందించిన కాంపిటీషన్ష్లోనూ, ప్రోగ్రామ్స్ లోనూ తను బొలెడు అవార్డులు కూడా గెలుచుకుంది. ఏదైతేనేమి కష్టపడి పైకొచ్చిన విష్ణుప్రియ మరింతగా ప్రేక్షకులకు దగ్గరవ్వాలని సోషల్ మీడియా నెటిజన్లు కాంగ్రాట్స్ తెల్పుతున్నారు.