తెలుగు సినిమా కమెడియన్లలో ప్రస్తుతం ఫామ్లో ఉన్నవారిలో పృథ్వీ ఒకరు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పృథ్వీ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల్లో నాటుకు పోయాయి. ఇక సినిమాలో ఆయన కనిపిస్తే ఏ డైలాగు చెప్పకుండానే మనకి నవ్వొస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు అయ్యి, విలన్ గా మరి చివరికి కమీడియన్గా సెట్ అయిన పృథ్వీ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఓసీ కులం లో పుట్టడం వల్లనే తనకి రావాల్సిన ఉద్యోగం రాలేదని తన బదులు వేరేవాడు డీఎప్సీ అయిపోయాడనీ అన్నారు ఆయన. నేను డీఎస్పీ అయి ఉంటే.. నా మాటకారితనం, నాకు రాజకీయ నేతలతో ఉన్న పరిచయాలతో ఏ మంత్రి దగ్గరో చేరి భజన చేసి ఈపాటికి ఓ జిల్లాకు ఎస్పీ కూడా అయిపోయేవాడిని. కీనీ నేను ఓసీ కావడంతోనే నాకు ఆరోజు ఉద్యోగం రాలేదు.
అయితే ఉన్నత కులంలో పుట్టడం వల్లే ఉద్యోగాలు రాలేదని అనుకున్నవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. కులం సంగతి పక్కన పెడితే మేము ఆర్ధికంగా చితికిపోయి ఉన్నాము. భవిష్యత్తులో నేను ఎమ్మెల్యే అయితే ఈ ఓసీ కులంలో ఉన్న బడుగు వర్గాల గురించి మాట్లాడతాను అన్నారు ఆయన. ఓసీల్లో రెడ్లు, రాజులు, చౌదరిలు, కాపు కులాల్లో ఒక లక్ష మందిలో పదివేల మంది బ్రహ్మాండంగా ఉన్నారు. ఇది వాస్తవం. బ్రహ్మాండమైన వ్యాపారాలు, తరతరాల ఆస్తులతో వాళ్లు చాలా బాగా ఉన్నారు. మరి మిగిలిన తొంభై వేల మంది పరిస్థితి ఏంటీ.. అంటున్నారు పృధ్వీ.