హీరో రాజశేఖర్ గురించి చెప్పుకోవడానికి ఈ మధ్య కాలంలో ఒక మంచి సినిమా అంటూ లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ తన సత్తా నిరూపించుకోవడానికి ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు గరుడవేగ చిత్రంతో వచ్చి బంపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ చిత్రం పై సినీ సెలబ్రటీలు ప్రశంసలు వర్షం కురిపిస్తుంటే.. రాజశేఖర్కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టీపిక్గా మారింది.
మాంచి విజయాలతో దూకుడు మీద ఉన్నప్పుడు రాజశేఖర్.. ఆయన సతీమణి జీవిత వచ్చాక ప్రతి పని ఆమెకే అప్పజెప్పాడు. చివరకు తాను ఎటువంటి సినిమాలు తీయాలన్నా జీవితే నిర్ణయించే పరిస్థితి వచ్చిందంటే, రాజశేఖర్ ఆమెకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చాడో అర్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లోనే రాను రాను రాజశేఖర్కు విజయాలు తగ్గిపోయి కనీస విజయం లేక ఇబ్బందులు పడవలసి వచ్చింది.
అంతే కాకుండా చిరంజీవి వర్గంతో గొడవలు ముదిరిపోయాయి. చివరకు రాజశేఖర్ తల్లి, చనిపోవడానికి ముందు వరకు రాజశేఖర్ విజయం కోసం ఎంతలా ఎదురుచూసిందో, గరుడవేగ ఆడియో వేడుకలో ఎంతో బాధతో చెప్పాడు. ఈ పరిస్థితుల్లో పీఎస్వి గరుడ వేగను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త పడ్డారని సమాచారం.
రాజశేఖర్ ఈ చిత్రం కోసం ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నారంటే.. చివరకు జీవిత మాటలను ఖాతరు చేయకుండా అప్పటి వరకు శతృత్వం పెంచుకున్న చిరంజీవి దగ్గరకు వెళ్లి మరీ తన సినిమా విశేషాలు పంచుకుని మూవీ ట్రైలర్ ను చూపించడమే కాదు చిరంజీవిని మొదటిరోజే సినిమా చూసేలా చేసాడు. మొత్తానికి జీవిత నిర్ణయాలపై ఆధారపడే రాజశేఖర్ చివరకు సొంత నిర్ణయాలతో మంచి విజయాన్నే అందుకున్నాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.