తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘అయ్యప్పనుం కోషియం’ తెలుగు రీమేక్. ఈ సినిమాలో పవన్కి జంటగా నటిస్తున్న టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రాజెక్ట్లో జాయిన్ అయినట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.
పవర్ స్టార్ మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్గా ఏకే రీమేక్ నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ రివీల్ చేయడంతో అంచనాలు బాగా పెరిగాయి. ప్రస్తుతం ఈ వీడియో ట్రండ్ అవుతోంది. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
‘భీమ్లా నాయక్’ అనే పవర్ఫుల్ పోలీస్ పాత్రలో పవర్ స్టార్ నటిస్తున్నాడు. ఆయనకి జంటగా నిత్యా మీనన్ నటిస్తోంది. సౌత్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె పవర్ స్టార్ సరసన నటిస్తుండటంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయింది. కాగా రానాకి జంటగా మరో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించబోతోంది. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.