ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించాడు. విజయ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్ బాబు డబ్బుల కోసం తనని, తన ఫ్యామిలీని మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. వారి వల్ల తనకు ప్రాణ హాని ఉందని కంప్లైంట్ ఇచ్చారు. వారి నుంచి తమను కాపాడాలని పోలీసులకు విన్నవించుకున్నారు.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పూరీ జగన్నాథ్ వాయిస్తో విడుదలైన ఆడియో ఒకటి వైరల్ అయ్యింది. అందులో లైగర్ సినిమా వల్ల నష్టపోయిన బాధితులంతా 27(ఈరోజు)న తన ఇంటి ముందు ధర్నా చేయనున్నారని, తన పరువు తీయడానికి ఇలా చేయడానికి సిద్ధం అయ్యారని చెప్పారు. డబ్బు తిరిగి ఇస్తానని చెప్పినా కొందరు డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని పూరీ పోలీసులకు తెలిపారు. ఇందుకు డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి తమ ఇంటిపై దాడి చేసేందుకు రెడీ అవుతున్నారని తమకు సెక్యూరిటీ ఇవ్వాలని ఫిర్యాదులో కోరారు పూరీజగన్నాథ్.