Home / MOVIES / ప్రభాస్‌కి షాక్.. కోర్టు నోటీసులు!

ప్రభాస్‌కి షాక్.. కోర్టు నోటీసులు!

ఓం రౌత్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజైంది. అప్పటి నుంచి విపరీతమైన ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు చిత్రబృందం. తాజాగా దిల్లీ కోర్టు కూడా ఈ టీమ్‌కు షాకిచ్చింది. ప్రభాస్‌తో పాటు మొత్తం ఆదిపురుష్‌ టీమ్‌కు నోటీసులు జారీ చేసింది కోర్టు.

ఆదిపురుష్ టీజర్‌లో యానిమేషన్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీనివల్ల ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను చూపించిన పద్థతి బాగోలేదని పలు సంస్థలు మండిపడుతున్నాయి. పవిత్ర రామాయణం గురించి అసలేం అధ్యయనం చేయకుండానే ఓంరౌత్ ఆదిపురుష్ తీస్తున్నారని ప్రముఖులు, రాజకీయ నేతలు ఆయనపై మండిపడుతున్నారు.

ఈ క్రమంలో ఈ మూవీ టీజర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందటూ ఓ సంస్థ దిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ మూవీ రిలీజ్‌పై స్టే విధించాలని కోర్టును కోరింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ప్రభాస్, ఆదిపురుష్‌ మొత్తం టీమ్‌కు నోటీసులు పంపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat