తెలుగు సినీ ఇండస్ర్టీలో బాలయ్య అని ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకునే హీరో బాలకృష్ణ, అంతేకాదు. బాలకృష్ణ అటు రాజకీయంగానూ.. ఇటు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. తాజాగా బాలకృష్ణ నటించిన జై సింహా చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. కత్తి మహేష్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదేంటీ.. కత్తి మహేష్ పవన్పై చేసే వ్యాఖ్యలు మామూలే కదా..? వైరల్ ఎందుకు అవుతాయంటారా..? అబ్బే అదేం లేదండి.. ఈ సారి మహేష్ తన కత్తి లాంటి కామెంట్స్ను పవన్వైపు కాకుండా.. బాలయ్య వైపు మళ్లించాడు.
ఎప్పుడూ.. పవన్పై కామెంట్స్తో బిజీ బిజీగా ఉండే కత్తి మహేష్.. బాలయ్యను ఏమన్నాడనేగా మీ డౌట్. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్న విలేకరి ప్రశ్నకు కత్తి మహేష్ స్పందిస్తూ.. బాలకృష్ణ ఓ చదువులేని మూర్ఖుడని తన మనసులోని మాటను చెప్పాడు కత్తి మహేష్. అంతటితో ఆగక బాలకృష్ణను వీలైనంత త్వరగా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చెయ్యాలని వ్యాంగ్యాస్ర్తాలను సంధించాడు. అయితే, తనకు బాలకృష్ణ నటించిన గౌతమి శాతకర్ణి చిత్రం చాలా బాగా నచ్చిందని, కానీ,, బాలకృష్ణ బిహేవియర్ తనకు అస్సలు నచ్చదంటూ బాలయ్యపై వివాదస్పద కామెంట్స్ చేశాడు. అభిమానులను కొట్టే సంస్కృతి ఉన్న వ్యక్తి ఓ హీరోనా అని ప్రశ్నించాడు.