టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ఇంజనీర్ బాబు, రాజు వచ్చినాడో అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ అజ్ఞాతవాసి అనే టైటిల్ నే ఫైనల్ చేశారని సమాచారం.
ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తారని అభిమానులు భావించినప్పటికి వారికి నిరాశే ఎదురైంది.
అయితే ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. కాగా ఫస్ట్లుక్ను నవంబరు 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం ఖాయమంటున్నాయని ఫిలింనగర్ వర్గాలు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ కూడా సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఖుష్బూ, బొమాన్ ఇరానీ, పరగ్ త్యాగి, ఆది పినిశెట్టి, రావు రమేశ్, మురళీశర్మ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.