ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.ఈ నెల ]28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే …
Read More »నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తాం.. జగదీశ్ రెడ్డి
రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు పలు సంస్థల ద్వారా శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్నామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,992 మంది ఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. న్యాక్లో శిక్షణ పొందిన 27 మందిలో 24 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. 500 మందికి …
Read More »సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం..మంత్రి జగదీశ్ రెడ్డ
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సోలార్ విద్యుత్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2,792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ప్రకటించారు. థర్మల్ విద్యుత్ వల్ల ఏర్పడే కాలుష్యం, ఇతరత్రా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. సోలార్ విద్యుత్తో …
Read More »ఆ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో నిన్న జరిగిన పడవ బోల్తా ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. Shocked to learn about the tragic boat accident in Krishna dist, A.P. Heartfelt condolences to the bereaved families? …
Read More »బోటు ప్రమాదంలో సీపీఐ నారాయణ సోదరి మృతిcpi narayana
సీపీఐ నేత నారాయణ కుటుంబంలో విషాదం అలముకుంది. నిన్న విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఆయన సోదరి మృతి చెందారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బోటులో ప్రయాణించారు. సంగమం వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె మరణించగా, ఆమె కోడలు, మనవరాలు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం నారాయణ భార్య, పలువురు …
Read More »మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న నల్లా మనోహర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు ,అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .నల్ల మనోహర్ రెడ్డి ఇప్పటికే పలు స్వచ్చంద కార్యక్రమాల్లో ,పలు సేవ కార్యక్రమాల్లో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటూ ఒక భరోసా కల్పిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఆదివారం జిల్లాలోని ఓదెల మండలంలో మడక …
Read More »కోమటిరెడ్డి..నీకు వచ్చిన ఓట్లను చూసి సీఎం కేసీఆర్పై సవాల్ విసురు..ఎంపీ గుత్తా
నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రోజూ తన పిచ్చిమాటలు, అబద్ధాలతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడంలో గోబెల్స్ను మించిపోయాడని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు తాను టీఆర్ఎస్ నుండి మళ్లీ కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ కొట్టిపారేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎంపీగా హస్తం గుర్తుపై తనను రెండుసార్లు గెలిపించినట్టుగా …
Read More »రేవంత్కు కాంగ్రెస్లో జరిగిన తొలి అవమానం ఇదే
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో తన సత్తా చాటుకోవాలని కలలు కన్న కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆదిలోనే షాక్ల పరంపర ఎదురువుతోంది. ఇప్పటికే కాంగ్రెస్పార్టీలో వ్యక్తిగత పాదయాత్రలకు అనుమతులు ఉండవని, తనకూ, మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వనట్టే, రేవంత్రెడ్డికి కూడా పాదయాత్ర చేసుకునేందుకు అనుమతి ఉండదని సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పి రేవంత్ గాలి తీసేసిన సంగతి మరువక ముందే.. ఆ పార్టీ అధిష్టానమే …
Read More »గొంతులో పూలుగు బొక్క ఇరికి వ్యక్తి మృతి
సూర్యపేట జిల్లా మిర్యాల గ్రామంలో ఓ వ్యక్తి మాంసం తింటూ ఒక్కసారిగా క్రింద కుప్పకూలాడు. ఆ తర్వాత ఊపిరాడక అతను చనిపోయాడు. మిర్యాల గ్రామంలోని రవీందర్(35) నాగోల్లోని ఓ భవనంలో వాచ్మేన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మటన్తో భోజనం చేస్తున్నాడు.కానీ ఆదరా బాదరా తినడంతో పూలుగు బొక్క గొంతులో ఇరుక్కుంది. దీనితో కొద్దిసేపు రవీందర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. బొక్క గొంతులో ఇరకడంతో శ్వాస తీసుకోవడానికి వీలులేకుండా పోయింది. వెంటనే కుటుంబసభ్యులు కామినేని …
Read More »ఈ నెల 23న యువ క్రికెటర్ భువనేశ్వర్ పెళ్లి
టీమిండియా యువ క్రికెటర్ భువనేశ్వర్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 23న భువీ తన ప్రేయసి నుపుర్ నగార్ను పెళ్లాడనున్నాడు. ఆయన సొంత వూరు మీరట్లోనే వివాహం జరుగనుంది. 26న బులంద్షహర్లో రిసెప్షన్ ఉంటుంది. నవంబరు 30న ఢిల్లీలో మరో రిసెప్షన్ జరుగుతుంది. మీరట్లో జరిగే వివాహానికి బంధువులు, స్నేహితులు హాజరవుతారని తెలిపాడు. కానీ భువి జట్టు సహచరులు, బోర్డు సభ్యులు కూడా మ్యారేజ్ లో పాలుపంచుకోవాలని …
Read More »