మూడు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టులో శ్రీనగర్ వెళుతున్న ప్రయాణికుడి బ్యాగులో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఓ బుల్లెట్ను గుర్తించారు. దీంతో విచారణ నిమిత్తం బుల్లెట్ను, సదరు ప్రయాణికుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుడు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత తనయుడు పరిటాల సిద్ధార్థ్. ఇతడి బ్యాగులోనే బుల్లెట్ లభించింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు 41 సీఆర్పీసీ కింద సిద్ధార్థ్ కు నోటీసులు అందజేశారు. లైసెన్స్ …
Read More »తెలంగాణలో స్థానిక సంస్థలకు రూ.432కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కేటాయించింది. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు, మండల పరిషత్లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్లకు రూ.125.95కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా స్థానిక సంస్థలకు నిధులు విడుదల …
Read More »బాధితుడి భార్యకు ఎల్వోసీ అందజేసిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుపతి అనే వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1,50,000 ఎల్వోసీ ని ఆయన భార్య ఉపేంద్రకు మంత్రి అందజేశారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఈ ఎల్వోసీని అందజేశారు.
Read More »ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పర్యటన
ఉత్తరాఖండ్లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో దేశం భద్రంగా ఉందని నడ్డా పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు మోదీ హయాంలో ఇప్పటివరకూ రూ 1.35 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు.డెహ్రాడూన్, రైవాలలో మాజీ సైనికులతో నడ్డా ముచ్చటించారు. వాజ్పేయి …
Read More »పూజా హెగ్డేపై దర్శకుడు ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై రోజా భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే సంవత్సరం ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో తెలుగు తెరకి పరిచయమైంది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాలీవుడ్లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ అందుకుంది. మళ్ళీ టాలీవుడ్లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో …
Read More »హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీతోపాటు 190 గ్రామాలకు జలమండలి సేవలు అందుతున్నాయని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునిక టెక్నాలజీతో మ్యాన్ హొళ్లలో పూడిక తొలగింపు జరుగుతున్నదని తెలిపారు. 2014కు ముందు తాగునీటి కోసం హైదరాబాద్లో నిత్యం ఆందోళనలు జరిగేవని, ప్రస్తుతం ఆ …
Read More »రెడ్డి హాస్టల్ భవనానికి 10 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ శివారు బుద్వెల్ లో నిర్మిస్తున్న రెడ్డి హాస్టల్ భవనానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ది నిధి నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్ధిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. రాజాబహాదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బుద్వెల్ లో 15 ఎకరాలు కేటాయించింది. రెడ్డి హాస్టల్ భవనం నిర్మాణానికి ఈ …
Read More »నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకుగాను మంత్రి హరీశ్ రావుకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషిచేస్తానని హరీశ్ రావు అన్నారు. అందరం కలిసి సొసైటీని ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. గత 80 ఏండ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహిస్తున్నదని …
Read More »రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది
తెలంగాణ రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది అని తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాలనేదే ప్రభుత్వ సంకల్పం అని ఆయన స్పష్టం చేశారు. 2014లో రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానం మేరకు.. 35.19 లక్షల మంది రైతులకు రూ. 16144.10 కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. 2018లో కూడా …
Read More »దేశంలో కొత్తగా 34,457 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 151 రోజుల కనిష్ఠానికి చేరిందని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 375 మంది మరణించారని వెల్లడించింది. కాగా, శుక్రవారం 36,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా వాటి సంఖ్య 34 వేలకు తగ్గింది. దీంతో …
Read More »