కరోనా కట్టడి కోసం విధించిన లాక్డ్ డౌన్ మంచి ఫలితాలను ఇస్తోంది. గత 24 గంటల్లో 91 వేల కొవిడ్ పరీక్షలు చేయడం జరిగింది.. ఇందులో 3,762 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. మరో 20 మంది కరోనాతో మృతి చెందారని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు గణనీయంగా 4.1 శాతానికి తగ్గిందని, మరణాల రేటు 0.56 శాతంగా ఉందని ఆయన …
Read More »మ్యాంగో తిన్నాక.. ఇవి అస్సలు వద్దు
మ్యాంగో తిన్నాక.. ఇవి అస్సలు వద్దు సమ్మర్లో మామిడి పండ్లు చాలా స్పెషల్. అయితే, మ్యాంగో తిన్నాక కొన్ని తినొద్దని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం మంచిది కాదు. మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకండి. మామిడి తిన్న వెంటనే కూల్డ్రింక్స్ తాగడం హానికరం. మ్యాంగో తిన్న వెంటనే.. నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ ఏర్పడతాయి.
Read More »నిన్న సూపర్ స్టార్..నేడు పవర్ స్టార్..కీర్తి లక్కీ భామ
వరుస అవకాశాలతో హీరోయిన్ కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న కీర్తికి తాజాగా మరో ఆఫర్ వచ్చిందట. తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తుండగా.. ఈ మూవీలో విజయ్కు జోడీగా కీర్తి నటిస్తుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, నిర్మాతగా వ్యవహరిస్తారని …
Read More »ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు
తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ వ్యాక్సినేషన్ అందించనున్నది.. I&PR ద్వారా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు రాష్ట్రంలో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ఆమోదం చెప్పిన ప్రభుత్వం.. జూడాలు విధుల్లో చేరాలని మరోసారి కోరింది.
Read More »మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్
దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.
Read More »మెగా హీరోకే షాకిచ్చిన ఉప్పెన బ్యూటీ
కరోనా కాలంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఉప్పెన మూవీతో హీరోయిన్ కృతిశెట్టి కుర్రకారును ఆకట్టుకోన్నది.. ఆ మూవీ విడుదలకు ముందే ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ మంగళూరు బ్యూటీకి సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఛాన్స్ వచ్చిందంట. కార్తీక్ వర్మ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మించనుండగా.. ఈ ఆఫర్కు కృతి నో చెప్పినట్లు …
Read More »భయమోద్దంటున్న సుమ..ఎందుకంటే…?
బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్, సరదాగా ఉండే యాంకర్ సుమ.. ఓ వీడియో ద్వారా అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. సై సినిమాలో రగ్బీ కోచ్ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ను అచ్చు గుద్దినట్లు దించేసిన సుమ.. ‘అందరూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి. భయపెట్టే వాటిని చూడకండి’ అని చెప్పింది.
Read More »కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు BRK భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ టీకా రెండో డోసు పంపిణీపై CS సోమేశ్కుమార్, అధికారులతో చర్చించారు. సూపర్ సైడర్లకు టీకాల పంపిణీ విధివిధానాలపై చర్చలు జరిపారు. త్వరలోనే వారికి వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండో డోసు తీసుకునేలా చూడాలన్నారు.
Read More »సరికొత్త పాత్రలో రావు రమేష్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న రావురమేశ్ లుక్ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్రంలో రావు రమేశ్ గూని బాజ్జీగా నటిస్తున్నట్లు వెల్లడించింది. ఆయన పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ టచ్ ఉంటుందట. ప్రస్తుతం ఈ ఫోటో సినీ అభిమానులను అలరిస్తోంది.
Read More »జింక్ వల్ల అనేక లాభాలు
శరీరానికి జింక్ ఎంతో మేలు చేస్తుంది. జింక్ శరీరంలో తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేసి, వైరస్లో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు 50 మి. గ్రా జింక్ తీసుకోవడం వల్ల కొవిడ్తో పోరాడటానికి సరిపడా రోగనిరోధక శక్తి లభిస్తుందని తేలింది. ఈ ఖనిజ లవణం సహజంగా మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్, నట్స్ వంటి వాటిల్లో లభిస్తుంది. అయితే, మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More »