శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. …
Read More »టీడీపీ నేతలకు మరియు పచ్చ మీడియాకు ద్వివేది షాక్..సాక్ష్యాలు విడుదల !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయలేదంటూ టీడీపీ నేతలతో మరియు పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారంపై ఈసీ అధికారులు ఘాటుగా స్పందించారు. సీఈఓ ఓటు వేయడాన్ని సాక్ష్యాలతో అందరికి చూపించారు.ద్వివేది ఓటు వేసిన వీడియోను అధికారులు శనివారం విడుదల చేయడంతో తెలుగు తమ్ములకు దిమ్మతిరిగింది. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ద్వివేది ఓటు వేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈవీఎంలో పనిచేయకపోవడంతో …
Read More »టీడీపీ దౌర్జన్యం..వైసీపీకి ఓటేశారన్న అనుమానంతో మహిళపై దాడి
మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారన్న అనుమానంతో ఎల్ఐసీ ఏజెంట్ వాసుపల్లి రామారావు, ఆయన భార్య నీలవేణిలపై టీడీపీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వాళ్ళపై దాడి చేసారు.ఆడవారని కూడా చూడకుండా జత్తుపట్టుకొని ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి కొట్టారు.ఈ ఘటన కుందువానిపేటలో శుక్రవారం జరిగింది. నీలవేణి తన పిల్లలను స్కూల్కు పంపే పనిలో ఉన్నప్పుడు అటుగా వచ్చిన టీడీపీ మాజీ సర్పంచ్ సూరడ అప్పన్న ఆమెను దూషించాడు. అంతేకాకుండా …
Read More »తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి తాళంపడింది.. అమరావతిలో ఆఫీస్ కు కూడా టూలెట్ బోర్డు పెట్టడం ఖాయం
తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి ఇప్పటికే తాళం పడిందని, అమరావతిలోని టీడీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డు వేసుకోవడం ఖాయమని వైసీపీ నేత రెహమాన్ అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ కొన్ని దుష్టశక్తులు వైఎస్సార్ కుటుంబాన్ని ఎన్నోవిధాలుగా ఇబ్బందులకు గురిచేసినా, ప్రజాభిమానమే ఈనాటి వరకు వారికి అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు దోపిడీనే ధ్యేయంగా ఐదేళ్లు పాలనను గాలికొదిలేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. పాలన అంటే ఏమిటో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి …
Read More »ఐ ప్యాక్ కార్యాలయంలో సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందానికి అభినందనలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని ‘ఐ–ప్యాక్’ కార్యాలయాన్ని సందర్శించిన జగన్ ప్రశాంత్ కిషోర్, ఆయన బృందం సభ్యులతో కొద్దిసేపు గడిపారు. జగన్ ఐప్యాక్ కార్యాలయానికి చేరుకోగానే అక్కడి సిబ్బంది అంతా ‘సీఎం.. సీఎం..’ అంటూ స్వాగతం పలికారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ జగన్ ను అభినందించారు. ఈ సందర్భంగా జగన్, ప్రశాంత్ కిషోర్ …
Read More »రేవంత్ రోడ్షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరణ..గంటలకొద్ది వేచిచూసినా కానరాని జనం
ప్రచారం చివరిరోజైన మంగళవారం రోడ్షోలతో హోరెత్తించాలనుకొన్న మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డికి ప్ర జలు చుక్కలు చూపించారు. అబద్ధపు మా టలు.. అసత్య ప్రచారాలతో మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రోడ్షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరించడంతో నాయకులు అవాక్కయ్యారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కాంగ్రెస్కు మద్దతిచ్చేది లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన వ్య క్తిని ఆదరించేది లేదంటూ మన్సూరాబాద్, బండ్లగూడకు చెందిన ప్రజలు, కాలనీ …
Read More »మల్లాది విష్ణుపైనే అందరి ఆశలు, అంచనాలు.. బెట్టింగులు సైతం భారీగా
ఆంధ్రప్రదేశ్ లో ఎండలవేడితో సైతం పోటిపడుతున్న రాజకీయాల గురించి మనందరికీ తెలిసిందే. ప్రతీ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు అంచనాకు రాలేకపోతున్నారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం అన్ని నియోజకవర్గాల కన్నా భిన్నంగా వైసీపీ నుంచి పోటి చేస్తున్న మల్లాది విష్ణు పై బెట్టింగ్ రాయుళ్ళు గెలుపు గుర్రంగా భావించి లక్షలు కాస్తున్నారు. భారీగా పందాలు వేస్తున్నారు. ఆయనకు వచ్చే మెజారిటీ పైనే బెట్టింగ్ రాయుళ్ళు లక్షల్లో వేస్తున్నారు. …
Read More »ఏబీఎన్ చానల్ సాక్షిగా బయటపడిన చంద్రబాబు-రాధాకృష్ణల కుట్ర.. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర ఏబీఎన్ సాక్షిగా బట్టబయలైంది. అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు ఏబీఎన్ రాధాకృష్ణ వద్ద చంద్రబాబు ఎన్టీఆర్ను దూషించిన వీడియో వైరల్ అయిందిజ ఎన్టీఆర్ పేరు ఎక్కడా కన్పించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు ఇంకా …
Read More »పవన్ కు పోసాని సవాల్..ఆయన మంచోడు కాదని పవన్ నిరూపిస్తే.. నేను పవన్ కల్యాణ్ను సమర్థిస్తా
నటుడు శివాజీ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పోసాని మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అవినీతి ఉందన్న శివాజీకి చంద్రబాబు మరిప్పుడెలా దేవుడయ్యారు? చంద్రబాబు ఎలాంటి వ్యక్తో.. జగన్ ఎలాంటి వ్యక్తో చూసి ఓటేయాలని ఏపీ ప్రజలను కోరుతున్నా. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి.. ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు లాక్కున్నారు. జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారు. ఇచ్చిన మాటను ఏనాడూ జగన్మోహన్రెడ్డి తప్పలేదు. …
Read More »దారుణం.. చింతమనేని కచ్చితంగా ఓడిపోవడం ఖాయం.. ఇతను గూండా
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు.. చింతమనేని అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ఏకంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై పోలీసుల సమక్షంలోనే చింతమనేని దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరిజిల్లా వట్లూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. వైయస్ఆర్సీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై చింతమనేని దాడికి యత్నించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం దగ్గర ఓటర్లకు టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతుండడంతో అడ్డుకునేందుకు అక్కడికి వచ్చిన వైయస్ఆర్సీపీ నాయకులపై …
Read More »