Home / SLIDER (page 1762)

SLIDER

వైసీపీలో చేరిన మాజీ సీనియర్ మంత్రి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది..ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.అప్పటి ఉమ్మడి ఏపీ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పని చేసిన మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీలో చేరారు.ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి …

Read More »

నల్లగొండ జిల్లా ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త

నల్లగొండ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు.జిల్లాలోని నకిరేకల్‌లో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు .ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో నకిరేకల్‌ పట్టణానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. …

Read More »

బోనాలు వేడుకలు సజావుగా జరపాలి..మంత్రి పద్మారావు

జంటనగరాల్లో బోనాలు వేడుకలు సజావుగా జరిపేల ఏర్పాట్లు జరుపుతున్నామని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బోనాలు ఏర్పాట్ల పై మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గం పరిధిలోని 160 మందికి పైగా ఆలయాల నిర్వాహకులు, కార్పోరేటర్లు , అన్ని విభాగాల అధికారులు నామాలగుండు లో జరిగిన  ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ..జూలై 29వ …

Read More »

సురేష్ ను పరామర్శించిన కడియం

ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా కోటి లింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్ లో జరిగిన భయానక అగ్నిప్రమాదంలో గాయపడి, నిమ్స్ లో చికిత్స పొందుతున్న సురేష్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు దవాఖానాకు వెళ్లి పరామర్శించారు. ఆయనకు జరుగుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని ఖర్చులు భరిస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో సురేష్ …

Read More »

రికార్డుల ద్వారా చరిత్రను భద్రపర్చుకోవాలి…!!

 మన చరిత్రను భద్రపర్చుకోవాలని, దానిని భావితరాలకు అందించాలని ఇందుకోసం రికార్డులను పదిలపర్చాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ 62వ జాతీయ సదస్సును నేడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. రికార్డులు లేకుండా చరిత్ర లేదని, ఇంతటి ముఖ్యమైన రికార్డులను డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రాచ్య …

Read More »

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..!!

పంచాయితీ రాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం దాటవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పంచాయితీ రాజ్ సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. …

Read More »

ఈఓడీబీలో మ‌న స‌త్తా..తెలంగాణకు రెండో స్థానం

అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ బ్యాంక్ ఏటా ప్రకటిస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’(ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణ దూసుకుపోతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గతేడాది 13వ ర్యాంక్‌ను దక్కించుకొన్న తెలంగాణ.. అనంత‌రం సైతం త‌న ముద్ర‌ను చాటుకుంటూ నంబ‌ర్  వ‌న్ స్థానంలో నిలిచింది. తాజాగా నంబ‌ర్ టూ స్థానంలో తెలంగాణ నిలిచింది. సంస్కరణల అమలులో తెలంగాణ రాష్ట్రం …

Read More »

4వ విడ‌త హ‌రిత‌హారం..ప్రారంభం ఇక్క‌డి నుంచే

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 వ విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలోనే భూపాలపల్లి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణకు హరితహారం, ధరణి ప్రాజెక్టు, స్వచ్ఛభారత్,  భూసేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా నిర్వహించాలని, అన్ని వర్గాల ప్రజలు, …

Read More »

ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం

ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి విష‌యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. నగరంలో నలు దిశాల ఐటీ విస్తరణ, భవిష్యత్తు వ్యూహంపైన ఈ రోజు విస్తృతస్థాయి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. నగరంలో ఐటీ పరిశ్రమను నలుదిశాల విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ప్రస్తుతం …

Read More »

జనసేనలో చేరిన వైసీపీ నేత ..!

ఏపీలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి కూడా వలసలు పర్వం కొనసాగుతుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సారి నవ్యాంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్త ఊపు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat