తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కు ఆంధ్రాలో ఎంత క్రేజ్ ఉందో మనందరి తెలిసిన విషయమే . గతంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు గానీ ఇటీవలే పరిటాల అనంత్ శ్రీరామ్ వివాహ వేడుకకు హాజరైనప్పుడు గానీ అక్కడి ప్రజలు సీఎం కేసీఆర్ కు ఎలా నీరాజనాలు పట్టారో చూశాం. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను అక్కడి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్లు కట్చేసి ఘనంగా జరుపుతున్న విషయం సైతం తెలిసిందే. …
Read More »పవన్ అభిమానుల పై రేణు దేశాయ్ సంచంలనం..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనని, తన పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి తోడుంటే బాగుంటుందని తన మనసులోమాట చెప్పిన విషయం తెలిసిందే. అయితే రేణు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేయడంపై …
Read More »పల్నాడు రాజకీయాల్లో సంచలనం -టీడీపీ నుండి మరో సీనియర్ ఎమ్మెల్యే ..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికల సమరం రానున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పులకు రెడీ అవుతున్నారు .ఈ క్రమంలోనే అధికార టీడీపీ పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరాడానికి సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగా ఇటీవల రాష్ట్రంలో జరిగియన మంత్రి వర్గ విస్తరణలో …
Read More »రాహుల్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి…!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 25ను ముహూర్తంగా నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షులు, ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈనెల 10 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా నిర్ణయించినట్టు చెప్పడంతో పీసీసీ, …
Read More »నేడు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన హెచ్ఎండీఏ బోర్డు సమావేశం
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా హెచ్ఎండీఏ రూపొందించిన ప్రణాళికలు ఆచరణ దిశగా నేడు అడుగులు పడనున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన బుధవారం బేగంపేటలోని మెట్రోరైల్ భవన్లో హెచ్ఎండీఏ ఏడవ బోర్డు సమావేశం జరగనుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ …
Read More »రేపు రెండు లాజిస్టిక్ పార్కులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన…!
హైదరాబాద్ నగర శివార్లోని బాటా సింగారం, మంగళంపల్లిలో లాజిస్టిక్ పార్కులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ( HMDA) ఆధ్వర్యంలో ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. హయత్ నగర్ మండలంలోని బాటా సింగారంలో 35 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో ఈ పార్కును సకల సౌకర్యాలతో నిర్మించనున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళంపల్లిలో 20 …
Read More »ఎయిర్పోర్టు సిటీ నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ నగరంలో ఎయిర్పోర్టు సిటీ నిర్మాణంపై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్ష చేపట్టారు. ప్రగతి భవన్లో చేపట్టిన ఈ భేటీ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. హైదరాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలు, సకల సౌకర్యాలతో అద్భుతమైన ఎయిర్పోర్టు సిటీగా తీర్చిదిద్దాలని తెలిపారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టర్మినల్ విస్తరణ చేపట్టాలన్నారు. అదేవిధంగా రెండో రన్వే నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పారు. అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ వేదికగా నిలుస్తున్నందున ఉన్నత ప్రమాణాలు, …
Read More »చినజీయర్స్వామితో జగన్ భేటీ…!
చినజీయర్ స్వామితో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. శంషాబాద్ లోని చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి, ఆయనతో చర్చలు జరిపారు జగన్. శంషాబాద్ సమీపంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఈ భేటీ జరిగింది. జగన్తోపాటు విజయసాయిరెడ్డి, వైసీపీ ముఖ్యనేతలు ఆశ్రమాన్ని సందర్శించారు. జగన్తోపాటు మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు. దాదాపు అర గంట పాటు వీరంతా సమావేశమయ్యారు. ఆశ్రమానికి వచ్చిన జగన్కు చినజీయర్ స్వామి శాలువా కప్పి సన్మానించారు. …
Read More »కంగనా నన్ను లైంగికంగా వేధించింది.. హృతిక్ మరో సంచలనం..!
బాలీవుడ్లో సెన్షేషన్ క్రియేట్ చేసిన హృతిక్ రోషన్-కంగనా రనౌత్ డర్టీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి రిపబ్లిక్ టీవీ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. కంగనపై గత ఏడాది ఏప్రిల్లో హృతిక్ లాయర్ మహేశ్ జఠ్మలానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెలికితీసి.. రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది. హృతిక్ చేసిన ఈ ఫిర్యాదులో కంగనపై పలు తీవ్ర ఆరోపణలు ఉండటం గమనార్హం. కంగనను తనను వెంటాడి వేధించిందని, ఆమె …
Read More »చంద్రబాబుకు”అది “లేదంటూ రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు ..
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కారు కు దాసోహం అయ్యాడు అని ఏపీపీసీసి చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు . ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఖలేజా లేదు కాబట్టే రాష్ట్ర ప్రయోజనాలను …
Read More »