తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలంలో ప్రారంభించిన రైతుబంధు ద్వారా ఈ యాసంగి దాకా నాలుగేండ్లలో 8 సీజన్లకు రైతాంగానికి రూ.50,682.30 కోట్లు పంట పెట్టుబడిగా ఇచ్చింది. ప్రస్తుతం 8వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. ఈ సీజన్లో గత నెల 28న ప్రారంభమైన రైతుబంధు పంపిణీ ఈ నెల 10 వరకు కొనసాగుతుంది.సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా …
Read More »తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో ఇద్దరు మరణించారు. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి మరో 232 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,733 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా నేడు 28,886 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.
Read More »తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. వీరిలో 27మంది బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Read More »బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో షేక్పేట్-రాయదుర్గం ఫ్లై ఓవర్ను ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ రాయదుర్గం వైపు నుంచి ఫ్లై ఓవర్ ఎక్కి షేక్పేట వైపు వెళ్లారు. ప్రయాణంలో వంతెనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎస్ఆర్డీపీ ఇంజనీరింగ్ అధికారుల బృందం గొప్పగా కృషి చేసిందని కొనియాడారు. అదే సమయంలో, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో దయచేసి ఈ ఫొటోలను …
Read More »అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని పలు హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించాయి. నమాజ్ను వ్యతిరేకిస్తూ, నాథూరాం గాడ్సేను పొగుడుతూ ఆయా సంఘాల నేతలు గురుగ్రామ్లో శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యల్ని చేసినందుకు గత నెల 30న అరెస్టు చేసిన కాళీచరణ్ మహారాజ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22 సంఘాలకు చెందిన ఆందోళనకారులు ఈ నిరసనల్లో …
Read More »మరోసారి మానవత్వం చాటుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి….
పర్వతగిరి మండల కేంద్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వతగిరి గ్రామ శివారులో కారు, బైక్ ఢీకొని ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వెంటనే క్షతగాత్రుల వద్దకు వెళ్లి అంబులెన్సు ఫోన్ చేసి బాధితులను పరామర్శించారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి, ఎంజీఎం సూపరేంటెండ్ గారికి ఫోన్ చేసి రోడ్డు …
Read More »తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,759 టెస్టులు చేయగా.. 311 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,898కు చేరాయి. .. గడిచిన 24 గంటల్లో 222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 159 మందికి టెస్టులు చేయగా.. 7 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
Read More »హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ కానుక
న్యూ ఇయర్ కానుకగా హైదరాబాద్ ప్రజల కోసం షేక్ పేట్ ఫ్లైఓవర్ ను ఈ రోజు మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. రూ. 333.55 కోట్ల అంచనాతో నిర్మించిన 2.8కి.మీ ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి JNTU జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేయనుంది.
Read More »కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వస్త్రాలపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు విరమించుకోవాలని లేఖలో కోరిన ఆయన.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించాలన్నారు. జీఎస్టీ పెంపుతో వస్త్ర పరిశ్రమ కుదేలవుతుందన్న మంత్రి కేటీఆర్ కోట్లాది మంది చేనేతల జీవితాలు దెబ్బతింటాయన్నారు. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు కూడా ఇబ్బంది పడతారన్న మంత్రి.. రైతుల మాదిరిగా నేతన్నలు కూడా కేంద్రంపై తిరగబడతారన్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 67కు పెరిగింది. వీరిలో 22మంది కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 280 కరోనా కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఒకరు చనిపోయారు. నిన్న మరో 206 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,563 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య …
Read More »