కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 109వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సాయిబాబా నగర్, కృషి కాలనీ, పుష్పగిరి బస్తి లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న చిన్నపాటి పనులను తెలుసుకున్నారు. కాగా నీటి సరఫరా, సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులు పూర్తి చేసినందుకు కాలనీల ప్రజలు ఎంతో సంతోషం …
Read More »వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను పంపిణి చేసిన ఎమ్మెల్యే కె.పి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుచిత్ర రోడ్డు లోగల చిరు వ్యాపారం చేసుకునే 262 మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఎమేల్యే కె.పి. వివేకానంద్ గారు తన నివాసం వద్ద కార్యాలయంలో పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వీటి పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవన కృషి స్ట్రీట్ వెండర్స్ ఆసోషియేషన్ …
Read More »భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. నాగమణి గారు,గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎల్. పి. మల్లారెడ్డి గారు, కూకట్పల్లి ఏసిపి శివ భాస్కర్ గారు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలపై …
Read More »హైదరాబాద్లో భారీ వర్షాలు- ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం
హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగర పరిధిలోని సాఫ్ట్వేర్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగులు మూడు విడుతల్లో లాగౌట్ చేయాలని సూచించారు. ఐకియా – సైబర్ టవర్స్ వరకు ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటలకు లాగౌట్ చేయాలని, ఐకియా – బయోడైవర్సిటీ వరకు ఐటీ ఆఫీసుల్లో సాయంత్రం …
Read More »ఆగస్టు మొదటివారం నుంచి జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తున్నదని, ఇప్పటికే ఇందులో అత్యధిక భాగం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల …
Read More »మారిన హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణపు వేళలు
తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణపు వేళలు మారాయి. ఇందులో భాగంగా నగరంలోని జూబ్లీ బస్టేషన్ (జేబీఎస్), మహాత్మాగాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) మధ్య కారిడార్-II లో మెట్రో రైలు సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలకు మార్చినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడం అధికారులకు టాస్క్ గా మారింది. ప్రధానంగా ఆఫీసు వేళల్లో మెట్రోల్లో …
Read More »హైదరాబాద్ లో రేపు పార్కులన్నీ బంద్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో గురువారం పార్కులు మూసిఉండనున్నాయి . తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్ఎండీఏ సెలవు ప్రకటించింది.సామాన్య ప్రజానీకానికి, పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత చర్యల్లో …
Read More »” తెలంగాణ మంచినీళ్ళ పండుగ “లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ” తెలంగాణ మంచినీళ్ళ పండుగ ” వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటగా గాజులరామారం దేవేందర్ నగర్ మంచినీటి రిజర్వాయర్ నుండి ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం షాపూర్ నగర్ పోచమ్మ ఆలయంలో మహిళలు బోనాలతో ప్రత్యేక పూజలు చేసి ఎంజే గార్డెన్స్ …
Read More »ఎస్టీపీలతో 100% మురుగునీటి శుద్ధీకరణ…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు ‘తెలంగాణ మంచినీళ్ళ పండుగ‘ను నిర్వహిస్తున్న నేపథ్యంలో చెరువులు కలుషితం కాకుండా వంద శాతం మురుగునీటిని శుద్దీకరించాలనే లక్ష్యంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.248 కోట్లతో చేపడుతున్న 5 ఎస్టీపీల నిర్మాణ పనుల్లో భాగంగా జీడిమెట్ల వెన్నెల గడ్డ వద్ద రూ.21.87 కోట్లతో 10 MLD సామర్ధ్యం గల ఎస్టీపీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అధికారులతో కలిసి పరిశీలించారు. …
Read More »నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించిన ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి నగర్ పుచ్చలపల్లి సుందరయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ రామకృష్ణ రావు గారితో …
Read More »