Home / TELANGANA (page 278)

TELANGANA

న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు

న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు విధించిన పోలీసులు.. క్యాబ్ డ్రైవర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్న పోలీసులు.. రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే, డ్రైవర్లు రద్దు చేయటానికి వీల్లేదన్నారు. క్యాబ్ సర్వీసును రద్దు చేస్తే రూ.500 జరిమానా వేస్తామన్న పోలీసులు.. సమస్య వస్తే 9490617111 నెంబర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

Read More »

సొంతగూటికి మాజీ మేయర్ రవీందర్ సింగ్

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ ను కలిశారు. దీంతో ఆయన మళ్లీ  టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్ సింగ్ టీఆర్ఎస్కు రెబెల్ గా పోటీ చేశారు. ఈ క్రమంలోనే పార్టీపై, మంత్రి గంగులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు బీజేపీ కూడా మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. కానీ తాజాగా సీఎం …

Read More »

సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు

తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయం కాగా, ప్రజలపై మరో భారం పడనుంది. సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పల్లెవెలుగు బస్సులకు కి.మీ.కు 25 పైసలు, ఎక్స్ప్రెస్ ఆ పైన బస్సులకు కి.మీ.కు రూ.30 పైసల చొప్పున పెంచాలన్న TSRTC ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, అనుమతి రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.

Read More »

దేశానికే ఆదర్శం తెలంగాణ రైతు బంధు పథకం….

దేశ ఆర్ధిక వ్యవస్థకి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి….. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతుల ఖాతాలలో రైతు బందు డబ్బులు జమ చేస్తున్న సందర్బంగా సీఎం కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాలాభిషేకం …

Read More »

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో 2004లో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్.. జహీరాబాద్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2016లో ఎమ్మెల్సీ  గా ఎన్నికయ్యారు.

Read More »

నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ -CM KCR

తెలంగాణలోని నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 31న రూ.110 కోట్లతో చేపట్టే ఐటీ హబు శంకుస్థాపన చేస్తామన్న సీఎం కేసీఆర్ నగరంలో 2 ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు. రూ.36 కోట్లతో కొత్త డిగ్రీ కాలేజీ భవనం నిర్మించాలన్న సీఎం.. పట్టణాన్ని సుందరంగా మార్చాలన్నారు. కాగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ నిన్న బుధవారం  …

Read More »

అమూల్ సంస్థ రావడం గర్వకారణం -మంత్రి KTR

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అమూల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా బేకరీ తయారీ ప్లాంటును అమూల్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. ప్లాంటు నిర్మాణానికి మొదటి దశలో రూ. 300 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న అమూల్.. రెండో దశలో మరో రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు …

Read More »

తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,023 టెస్టులు చేయగా.. 235 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,307కు చేరాయి.. గడిచిన 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 346 మందికి టెస్టులు చేయగా.. 10 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.

Read More »

సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి KTR సెటైర్స్

ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 75కే చీప్ లిక్కర్, ఇంకా కుదిరితే రూ.50కే ఇస్తామంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘వావ్… ఏమి పథకం! ఎంత అవమానకరం. ఏపీలో బీజేపీ మరింత దిగజారింది’ అంటూ ఎద్దేవా చేశారు. చీప్ లిక్కర్ను రూ.50కే సరఫరా చేయాలనేది బీజేపీ జాతీయ విధానమా? లేక నిరాశ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమేనా ఈ బంపర్ …

Read More »

TRS Mp కె. కేశవరావు కి కరోనా

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కరోనా బారినపడ్డారు. RTPCR పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. వెంటనే ఆయన నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. వారి సలహా మేరకు ఇంటికి వెళ్లి క్వారంటైన్లో ఉన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat