తెలంగాణ ఏర్పడే నాటికి దాని జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లు.. ఏడున్నరేండ్ల తర్వాత ఇప్పుడు అక్షరాలా రూ.9.80 లక్షల కోట్లు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు తలసరి ఆదాయం సుమారు రూ.95 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.2.37 లక్షలు. పెద్ద.. చిన్న అన్న తేడా లేకుండా అన్ని రాష్ర్టాలను దాటుకొని.. స్వల్పకాలంలోనే ఎవరికీ అందనంత వేగంగా తారాజువ్వలా రాష్ట్ర ఆర్థిక వృద్ధి దూసుకుపోతున్నది. ఈ వృద్ధి రాజధానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రమంతటా …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్ పై హైకోర్టు శుభవార్త
ఆల్కాహాల్ సేవించి వాహనం నడపడం ప్రమాదకరం.. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఎవరైనా మద్యపానం చేయరాదు.. అయితే, అనునిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య వాహన చోదకులు స్పీడ్గా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అదే మద్యం మత్తులో ఉంటే మరింత స్పీడ్గా వెళుతుంటారు.. అటువంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.. దీన్ని నివారించడానికి పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట వాహన చోదకులను నిలిపి వారు మద్యం సేవించారా.. …
Read More »అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ..
ఖమ్మంజిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి ఓ గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లాడ మండలంలోని నూతనకల్ గ్రామానికి చెందిన కొమ్ము మౌనిక అనే గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో వెంటనే ఆమెను తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నవ్యకాంత్ అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బందితో కలిసి హాస్పటల్ కు చేరుకున్నారు. గర్భిణీని పరీక్షించిన డాక్టర్ నవ్య …
Read More »రైతు తలరాత మార్చే తరతరాలు ఉండే ప్రాజెక్టు
సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు. రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు ఇది. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక శాఖ …
Read More »ఈటల రాజేందర్ పై కేసు నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి కరీంనగర్లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈటల రాజేందర్, ఆయన అనుచరులపై కేసు నమోదు …
Read More »ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ
యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై ఏర్పాటుచేసి న అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక సంస్కరణలు, పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని స్పష్టం చేశారు. సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో …
Read More »కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి జానారెడ్డి షాక్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గాంధీభవన్లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కాగా పీఏసీ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నల్గొండలో స్నేహితుడి అంత్యక్రియలకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ‘‘ప్రతి సారి సమావేశానికి రాను.. నా అవసరం ఉన్నప్పుడే వస్తా’’ అంటూ వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రజలకు జానారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పీఏసీ సమావేశంలో హుజురాబాద్ ఫలితంపై సమీక్ష, వరి సాగు, నిరుద్యోగ …
Read More »TPCC చీఫ్ రేవంత్ పై కాంగ్రెస్ నేతలు అగ్రహాం
తెలంగాణలో నిన్న మంగళవారం ఫలితాలు విడుదలైన హుజురాబాద్ ఉప ఎన్నికలో 3112 ఓట్లకే ఎందుకు పరిమితమైంది? కాం గ్రెస్కు సంస్థాగతంగా ఉన్న ఓటింగ్ అంతా ఎక్కడికి పోయింది? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఈ ప్రశ్న అనేక ఊహాగానాలకు తెర తీస్తున్నది. శత్రువు శత్రువు మిత్రుడైనట్టు.. ఢిల్లీలో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమని మండిపోయే బీజేపీ కాంగ్రెస్లు.. హుజూరాబాద్ ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకొని తిరిగాయ ని, తద్వారా కాంగ్రెస్ ఓట్లు సాలీడ్గా బీజేపీకి పడ్డాయని పలువురు …
Read More »కాంగ్రెస్ టికెట్ 25 కోట్లకు తాకట్టు పెట్టిన రేవంత్
హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కుమ్మ క్కు కావడం వల్లే బీజేపీ గెలిచిందని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హుజూరాబాద్ కాంగ్రెస్ టికెట్ను రూ.25 కోట్లకు లోపాయికారిగా బీజేపీకి అమ్ముకొన్నారని ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో హుజూరాబాద్ ఉప ఎన్నిక లెక్కింపు కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్కుమార్రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న హయాంలో గత హుజూరాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి 62 …
Read More »NEET లో తెలంగాణ గురుకులం సత్తా
జాతీయస్థాయిలో వైద్య విద్యాప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాది 135 మంది విద్యార్థులు నీట్లో అర్హత సాధించగా.. ఈ సారి ఏకంగా 305 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 35 మంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అర్హతను సాధించగా.. ఈ ఏడాది ఏకంగా 65 మంది వివిధ రిజర్వేషన్ …
Read More »